3-8-2018 తిరుమల శ్రీవారి సమాచారం 

ఓం నమో వేంకటేశాయ

ఈరోజు తేదీ  03.08.2018

 గురువారం ఉదయం 7 గంటల సమయానికి, సర్వదర్శనం కోసం  కంపార్టమెంట్లలు అన్ని నిండిపోయి క్యూ లైన్లో భక్తులు నిరీక్షిస్తున్నారు. కంపార్టమెంట్లలోని భక్తులకు సుమారుగా  20 గంటల సమయంలోపు స్వామివారిని దర్శనం పూర్తయి చేసుకొని ఆలయం వెలుపలికి రావచ్చు.

కాలి నడక మార్గంలో అలిపిరి నుండి 14000, శ్రీవారిమెట్టు నుండి 6000 మందికి స్లాట్స్ కేటాయిస్తారు. స్లాట్స్ మేరకు ఉ.9 గం. తరువాత నేరుగా దర్శనానికి అనుమతిస్తారు.

కాలి నడకద్వారా వచ్చు స్లాట్స్ కలిగి ఉన్న భక్తులకు సుమారుగా 5 గం.ల సమయం పట్టవచ్చు. స్లాట్స్ ద్వారా సర్వ దర్శనానికి వచ్చే భక్తులకు సుమారుగా 5 గం.ల లోపు   శ్రీవారిని దర్శించుకోవచ్చు.

ప్రత్యేక ప్రవేశ దర్శనం (₹: 300) భక్తులకు  3 గంటలకు దర్శనం పూర్తయి ఆలయం వెలుపలికి రావచ్చు. నిన్న ఆగస్టు 02 న 72,260 మంది భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం లభించినది.

‌ ‌నిన్న 27,718 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు.

నిన్న స్వామివారికి భక్తులు పరకామణి ద్వారా సమర్పించిన నగదు కానుకలు ₹3.55 కోట్లు.

గురువారం ప్రత్యేక సేవ, అభిషేకం.

ఓం నమో వేంకటేశాయ