విశాఖపట్నంలో దారుణం జరిగింది. అధికారులు దౌర్జన్యానికి ఒడిగట్టారు. విశాఖపట్నం వేపగుంటలో కూలి పనులు చేసుకునే అభాగ్యులపై జివిఎంసి జోన్-6 జోనల్ కమిషనర్ సత్యనారాయణ అధికార అహం చూపించారు. నడిరోడ్డులో కూలీలను ఇష్టం వచ్చినట్టు కొట్టారు. వారి చేతిలో ఉన్న చీపుళ్లను లాక్కుని మరీ కొట్టబోయారు.
వారి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా విచక్షణ కోల్పోయి కఠినత్వం ప్రదర్శించారు. అధికారులు ఆ కూలీలను అరేయ్, ఒరేయ్ అంటూ దుర్భాషలాడారు. స్థానికులు అధికారుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం ఉంది కదా అనే దౌర్జన్యం చూపిస్తున్నారంటూ మండి పడుతున్నారు. ఇదెక్కడి న్యాయం అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సదరు అధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి. అధికారులు కూలీలపై దౌర్జన్యం చేస్తున్న వీడియో కింద ఉంది చూడండి.