దారుణం..తన ప్రేమను అంగీకరించలేదని యువతితో పాటు కుటుంబం సభ్యులపై యువకుడి దాడి?

ప్రస్తుత కాలములో యువతి యువకులు ప్రేమ పేరుతో మోసపోతున్నారు. ఈ మాయలో పడి కొందరు తల్లి తండ్రులను మోసం చేస్తుంటే మరి కొందరి మాత్రం ఈ ప్రేమా వ్యవహారాలకు దూరంగా ఉన్నా కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. యువకుడు ప్రేమని యువతి నిరాకరిస్తే వారి మీద కక్ష్య సాధించడానికి యువకులు అమ్మాయిల మీద యాసిడ్ పోయటం, వారిని బలవంతంగా లోబరుచుకోవటం, లేదంటే వారి ప్రాణాలు సైతం తీయటానికి వెనుకాడటం లేదు. తాజాగా ఇలాంటి దారుణ సంఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఒక యువకుడు యువతిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది.

వివరాల్లోకి వెళ్తే…కృష్ణా జిల్లా మొవ్వ గ్రామంలో అంబేద్కర్ నగర్ లో నివసిస్తున్న మల్లారపు నాగ రాజ్యం, నాగేశ్వరరావు దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. 2013 లో నాగేశ్వరరావు మృతి చెందటంతో నాగరాజ్యం తన ముగ్గురు కూతుర్లతో కలిసి జీవిస్తోంది. అయితే కొంతకాలంగా నాగరాజు పెద్ద కూతురు నాగాదేశిని జోయల్ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్నాడు. కొంతకాలంగా ఆమెను ఆ యువకుడు తన ప్రేమను అంగీకరించమని వేడుకున్నా కూడా ఆమె నిరాకరించింది. దీంతో యువకుడు కోపంతో రగిలిపోయి నేరుగా ఆమె ఇంటికి వెళ్లి యువతి పై కత్తితో దాడి చేస్తున్న క్రమంలో అతనిని అడ్డుకోవటానికి ప్రయత్నించిన యువతి తల్లి, ఇద్దరు చెల్లెళ్లపై కూడా దాడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వారిని మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి గురించి సమచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు కారణమైన జోయల్ కి కఠిన శిక్ష విధించాలని నాగరాజ్యం కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్థుత కాలంలో కొంతమంది యువకులు ఇలా ప్రేమోన్మాదులుగా మారి యువతుల ప్రాణాలతో పాటు వారి కుటుంబ సభ్యుల పై కూడా దాడికి పాల్పడుతున్నారు. ఈ క్రమంలో యువతులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.