ప్రేమోన్మాది చేతిలో గాయపడ్డ వరంగల్ రవళి మృతి

వరంగల్ లో ప్రేమోన్మాది చేతిలో గాయపడ్డ రవళి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందింది. హన్మకొండలోని వాగ్దేవి కాలేజిలో డిగ్రీ చదువుతున్న రవళి పై అదే కాలేజికి చెందిన అన్వేష్ ఆరు రోజుల కింద పెట్రోల్ తో దాడి చేసిన విషయం తెలిసిందే. రవళి శ్వాస నాళాలు పూర్తిగా కాలిపోవడంతో వెంటిలేటర్ పై చికిత్సనందించారు.

రవళి చికిత్సకు శరీరం సహకరించకపోవడంతో డాక్టర్లు విశ్వప్రయత్నాలు చేశారు. కానీ రవళి బతకలేదు. రవళి మృతితో తల్లిదండ్రులు భోరుమన్నారు. అన్వేష్ ను కూడా చంపేయాలని వారు డిమాండ్ చేశారు.