ఆస్తి కోసం కన్న తండ్రి పట్ల కిరాతకంగా ప్రవర్తించిన కొడుకు.. దాడిలో మృతి చెందిన తండ్రి?

ప్రస్తుత కాలంలో సమాజంలో డబ్బుకి ఉన్న విలువ బంధాలకి బంధుత్వానికి లేదు. డబ్బు కోసం ప్రజలు ఎంతటి దారుణాల కైనా పాల్పడుతున్నారు. ముఖ్యంగా కొందరు వ్యక్తులు డబ్బు కోసం కుటుంబ సభ్యులతో తగాదాలు పెట్టుకుని వారిని హతమార్చడానికి కూడా వెనకాడటం లేదు. కనిపించిన తల్లిదండ్రులు తోడబుట్టిన అన్నదమ్ములు అని కనికరం లేకుండా ఆస్తికోసం దారుణంగా హత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఇటువంటి దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్తికోసం తండ్రిని కనికరం లేకుండా కొడుకు దారుణంగా హత్య చేసిన ఘటన రాయచోటి మండల పరిధిలో చోటుచేసుకుంది .

వివరాలలోకి వెళితే… రాయచోటి మండల పరిధిలోని దిగువ అబ్బవరం గ్రామం ఇందుకూరు పల్లెకు చెందిన సాంబమూర్తి అనే వ్యక్తికి నలుగురు కుమారులు. వీరిలో ఇద్దరికీ వివాహం కాగా ఏడాది క్రితం ఒక కుమారుడు ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. ఇక మరొక కుమారుడు తండ్రితో కలిసి నివసిస్తున్నాడు. అయితే సంవత్సరం నుండి సాంబమూర్తి రెండవ కుమారుడు రెడ్డయ్య ఆస్తిలో తనకు రావలసిన వాటా పంచి ఇవ్వాలంటూ ప్రతిరోజు తండ్రితో గొడవ పడుతూ ఉండేవాడు. కొన్ని రోజులుగా ఆస్తి విషయమై ఇద్దరి మధ్య గొడవలు మరింత పెరిగాయి

ఈ క్రమంలో తనకు ఆస్తి ఇవ్వలేదని తండ్రి మీద కక్ష పెంచుకున్న కుమారుడు శుక్రవారం రాత్రి తండ్రితో మరల గొడవపడ్డాడు. ఈ క్రమంలో గొడ్డలితో తండ్రి పై విచక్షణ రహితంగా దాడి చేసి అక్కడి నుండి పారిపోయాడు. గొడ్డలితో దాడి చేయడం వల్ల సామమూర్తి తీవ్ర గాయాల పాలవటంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని రాయచోటి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే సాంబమూర్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి ఎస్ఐ నరసింహారెడ్డి ఆస్పత్రికి చేరుకొని ఘటన గురించి కుటుంబ సభ్యులను విచారణ చేశారు. తర్వాత రెడ్డయ్య మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.