ప్రియురాలిని చంపి ఫ్రీజర్ లో పెట్టి మరొక మహిళను వివాహం చేసుకున్న ప్రియుడు..!

ప్రస్తుత కాలంలో ప్రేమ పేరుతో అమ్మాయిలు దారుణంగా మోసపోతున్నారు. కొంతమంది యువకులు ప్రేమించి పెళ్లి చేసుకుంటామని నమ్మించి అమ్మాయిలను లొంగదీసుకుంటున్నారు. ఆ తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకోమని కోరితే దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇటువంటి దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోమని కోరడంతో అందుకు నిరాకరించిన ప్రియుడు ఆమెను చంపి ఫ్రీజర్ లో దాచిపెట్టి అదేరోజున మరొక మహిళను వివాహం చేసుకున్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో ఉండే సాహిల్ అనే యువకుడు ఎస్‌ఎస్‌సి ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. సాహిల్ గత కొన్ని సంవత్సరాల నుంచి నిక్కి యాదవ్ అనే యువతి తో ప్రేమాయణం సాగిస్తున్నాడు. నిక్కి మెడికల్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుంది. ఇలా చాలా కాలంగా వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని వివాహం చేసుకోవాలని అనుకున్నారు. అయితే సాహిల్ కుటుంబ సభ్యులు అతడికి పెళ్లి చేయాలని నిర్ణయించి ఒక అమ్మాయితో సాహిల్‌కు పెళ్లి నిశ్చయం చేశారు. వివాహం గురించి తెలుసుకున్న నిక్కి వివాహం గురించి అతనిని నిలదీసింది .

వెంటనే తనని పెళ్లి చేసుకోవాలని కోరింది. అయితే సాహిల్ అందుకు నిరాకరించటంతో ఆమె గొడవకు దిగింది. కొన్ని రోజులుగా ఈ విషయం గురించి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇక ఫిబ్రవరి 9న ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది. దీంతో సాహిల్ ఆగ్రహానికి గురి నిక్కి మెడకు డాటా కేబుల్ వైర్ చుట్టి హత్య చేశాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఆమె మృతదేహాన్ని ఫ్రిజ్‌లో దాచిపెట్టాడు. అయితే అదే రోజు కుటుంబ సభ్యులు నిశ్చయించిన మరో యువతిని సాహిల్ వివాహం చేసుకున్నాడు. గత మూడు నాలుగు రోజులుగా నిక్కి కనిపించకపోవడంతో ఆమె తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా సాహిల్ నిందితుడిగా తేలడంతో అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.