కృష్ణా జిల్లాలో పట్టపగలే విద్యార్థి కిడ్నాప్

కృష్ణా జిల్లాలోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న ఆరవ తరగతి విద్యార్థి కిడ్నాపయ్యాడు. అగిరి పల్లి లో ఎస్.వి పబ్లిక్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్న వీర్ల లీలా ప్రసాద్ పాసు పోసుకునేందుకు స్కూల్ బయనుంచి బయటకు వచ్చాడు. వెంటనే అక్కడే మాటు వేసి ఉన్న గుర్తుతెలియని వ్యక్తులు ఈ రోజు ఉదయం కిడ్నాప్ చేశారు. చిన్నఅగిరి పల్లి గొల్లగూడెంకు చెందిన విద్యార్థి మంగళవారం ఉదయం 9గంటలకు స్కూల్ వ్యాన్లో స్కూలు చేరుకున్నాడు. పదిన్నర గంటల ప్రాంతంలో స్కూలు ఆవరణ విడిచి పాసు పోసుకునేందుకు బయటకు రాగానే కిడ్నాప్ కు గురికావడం ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. విద్యార్థిని ఎందుకు కిడ్నాప్ చేశారో, ఏ హాని తలపెడతారో నని స్కూల్ యాజమాన్యంతోపాటు విద్యార్థి ఆందోళన చెందుతున్నారు.

ఫ్లాష్ .. అయితే మధ్యాహ్నానికి పోలీసు బాలుడి అచూకి కనుగొన్నారు. గ్రామ సమీపంలోని ముళ్లపొదల్లో  కాళ్లు కట్టేయబడి లీలా ప్రసాద్ పడిఉండటాన్ని పోలీసులు  కనుకొన్నారు.