ఛీ ఛీ..మద్యం మత్తులో ఆ తండ్రీ చేసిన పని తెలిస్తే షాక్..?

ప్రస్తుతం చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ మధ్యానికి బానిసలు అవుతున్నారు. కొంతమంది మహిళలు కూడా మద్యానికి బాగా అలవాటు పడుతున్నారు. ఈ మద్యం మహమ్మారి ఎన్నో కుటుంబాలను విచిన్నం చేస్తోంది. ఈమధ్యం అలవాటు వల్ల భార్య భర్తల మధ్య గొడవలు జరిగి ఒకరికి ఒకరు దూరం అవటమే కాకుండా మద్యం మత్తులో కొన్ని సందర్భాలలో దారుణాలకు కూడా పాల్పడుతున్నారు. ఈ క్రమంలో కొంతమంది భర్తలు మద్యం మత్తులో హత్యలు చేయటానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల బీహార్ లో కూడా ఇటువంటి దారుణ సంఘటన చోటుచేసుకుంది మద్య మద్యలో తేలిపోతున్న ఒక తండ్రి చేసిన పనికి 9 నెలల చిన్నారి బలి అయ్యింది.

వివరాలలోకి వెళితే… బీహార్ లోని నవాడా జిల్లా వారిస్లిగంజ్ పరిధి బర్నావా గ్రామంలో నివాసం ఉంటున్న హోరిల్ మాంఝీ, కిరణ్‌దేవి దంపతులకు 9 నెలల క్రితం కుమార్తె జన్మించింది. హోరిల్ మాంఝీ మద్యానికి అలవాటు పడి దానికి బానిసగా మారిపోయాడు. ఈ క్రమంలో రోజు తాగి ఇంటికి వచ్చి గొడవ చేసేవాడు. అయినా కూడా కిరణ్ దేవి భర్త ఆగడాలను భరిస్తూ వచ్చింది. ఈ క్రమంలో గురువారం రోజు రాత్రి సమయంలో హోరిల్ మాంఝీ ఫుల్లుగా మద్యం సేవించి తోలుతూ ఇంటికి వచ్చాడు.

యధావిధాంగానే కిరణ్ దేవి భర్తకు భోజనం వడ్డించి నిద్రకు ఉపక్రమించింది. భోజనం తిన్న తర్వాత బట్ట తరుచూ ఆమెను నిద్రపోనివ్వకుండా వేధించాడు దీంతో కిరణ్ దేవి కి కోపం వచ్చి తన పుట్టింటికి వెళ్ళిపోతాను అంటూ బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళబోయింది. ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహానికి గురైన హోరిల్ మాంఝీ భార్య చేతిలో ఉన్న బిడ్డను లాక్కొని బలంగా నేలకేసి కొట్టాడు. ఈ క్రమంలో చిన్నారికి బలంగా గాయం తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో కిరణ్ దేవి ఒక్కసారిగా షాక్ కి గురైంది. చేరుకొని ఈ విషయాన్ని స్థానికుల వద్ద వెల్లడించి బోరుమంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.