రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి

ఖమ్మం జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు స్పాట్ లో చనిపోయారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఈ ఘటన జరిగింది.

నేలకొండపల్లిలోని డబుల్ బెడ్రూం కాలనీకి చెందిన వెంకటేశ్వర్లు, కోదండరాం, ప్రణయ్, పిచ్చమ్మ నలుగురు ఒకే బండి పై ముదిగొండలో ఫంక్షన్ కు వెళుతున్నారు. వీరి బైక్ ను వెనుకనుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో అక్కడ విషాద చాయలు అలుముకున్నాయి.