మనిషిని రాళ్లతో కొట్టిచంపిన కోతులు

యూపీలో భాగ్ పట్ సమీపంలోని టిక్రీ  గ్రామంలో ఓ వృద్ధుని  మీద కోతులు రాళ్లతో దాడి చేసి చంపాయి. కోతులపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలనీ కుటుంబ సభ్యులు పోలీసులను ఇబ్బంది పెడుతున్నారు. పుల్లలు తేవడానికి అడవికి వెళ్లిన వృద్దునిపై కోతులు రాళ్లతో  దాడి చేశాయని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. గాయపడిన వృదుడిని హాస్పిటల్ లో చేర్పించారు. చికిత్స పొందుతూ వృధుడు మరణించాడు. అయితే ఇప్పుడు ఆ కోతులను వెతికి , అరెస్ట్ చేసి , కోర్ట్ లో పెట్టాలి అంటే ఇదంతా అయ్యే పని కాదని పోలీసులు  వేరే కథనం వినిపిస్తున్నారు. వృధుడు అలసిపోయి రాళ్ల కుప్ప దగ్గర  నిద్రపోతుంటే కోతులు వచ్చి గంతులు వేశాయని అప్పుడు ఆ రాళ్లు వృద్దుడి మీద పడిందని చెబుతున్నారు. ఆ గాయాలతోనే అతను మరణించాడని పోలీసులు అంటున్నారు.కుటుంబ సభ్యులు మాత్రం కోతులపై కేసు నమోదు చేయాల్సిందే అంటున్నారు.