ప్రేమించి పెళ్లి చేసుకొని మొగుడి ఫ్రెండ్ తో జంప్ అయ్యింది

వారిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. జీవితాంతం కలిసి ఉంటామని ప్రమాణం చేశారు. వీరి పచ్చని సంసారానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆనందంగా సాగుతున్న వారి జీవితంతో భర్త స్నేహితుడు కుంపటి రేపాడు. దీంతో రెండు జీవితాలతో పాటు పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. నెల్లూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఖమ్మం జిల్లాకు చెందిన సంధ్య, నెల్లూరు జిల్లా కాటుకూరుకు చెందిన మహేశ్వరరావు కి 7 సంవత్సరాల కింద హైదరాబాద్ లో పరిచయం అయ్యింది. వారి పరిచయం ప్రేమకు దారి తీసింది. అయితే ఇంట్లో తెలిస్తే గొడవలు అవుతాయనే ఉద్దేశ్యంతో ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. 

పెళ్లైన తర్వాత సంధ్యను తీసుకొని మహేశ్వరరావు వారి సొంతూరుకు వెళ్లాడు. కుటుంబ సభ్యులు కూడా పెళ్లి చేసుకొని రావడంతో ఏం అనలేదు. ఇరు కుటుంబాలు కూడా బాగానే కలిసి పోయాయి. వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఖర్చులు పెరుగుతుండటంతో ఊళ్లో సంపాదించేది వారికి సరిపోవట్లేదు. దీంతో మహేశ్వరరావు హైదరాబాద్ కు పని నిమిత్తం వచ్చి భార్యా పిల్లలను గ్రామంలోనే ఉంచాడు.  నెలకోసారి మహేశ్వరరరావు గ్రామానికి వచ్చి వెళ్లేవాడు.

పిల్లలు చిన్న వారు కావడంతో తరచు అనారోగ్యానికి గురయ్యేవారు. మహేశ్వరరావు అన్న దమ్ములు ఆర్ధికంగా వెనకబడటంతో వారు వీరికి సహాయం చేయలేక పోయారు. మహేశ్వరరావు దోస్తు నాగార్జున. ఈయన గ్రామంలో డబ్బున్న వాడిగా పేరు తెచ్చుకున్నాడు.ఈ క్రమంలో మహేశ్వరరావు నాగార్జునను డబ్బు సాయం అడిగాడు. దాంతోపాటు అప్పుడప్పుడు వెళ్లి బాగోగులు చూసుకోమని చెప్పాడు. ఇలా తరచు మహేశ్వరరావు ఇంటికి నాగార్జున వచ్చి వెళ్లేవాడు.

ఇదే క్రమంలో సంధ్యతో బాగానే పరిచయం పెంచుకున్నాడు. 3 నెలల క్రితం ఓ రోజు రాత్రి సంధ్య ఇంటికి వెళ్లాడు. పురుగుల మందు డబ్బాను తీసుకెళ్లి తన కోరిక తీర్చక పోతే చనిపోతానని బెదిరించాడు. ఒప్పుకోకున్నా కూడా మన మధ్య వివాహేతర సంబంధం ఉందని చెప్పి చస్తానని బెదిరించాడు. దీంతో సంధ్య చేసేదేం లేక అతనికి లొంగి పోయింది. అదే రోజు ఏకాంతంగా గడిపిన వీడియోను నాగార్జున రహస్యంగా తీశాడు. ఇది తెలియక సంధ్య ఇంతటితో తనను వదిలి వేయాలని వేడుకుంది.

మరో రోజు వెళ్లిన నాగార్జున తాను రికార్డు చేసిన వీడియోను చూపించి బెదిరించాడు. వీడియోలు అందరికి చూయిస్తానన్నాడు. అలా బెదిరిస్తూ 3 నెలలుగా ఆమె పై అత్యాచారం చేశాడు. ఈ విషయం గ్రామస్తుల ద్వారా మహేశ్వరరావుకి తెలిసింది. తనను బలవంతంగా అత్యాచారం చేశాడన్న కూడా ఆమె మాట వినేవారే లేరు. దీంతో పిల్లలను వదిలి నాగార్జున ఇంటికి వెళ్లింది. తన జీవితం ఆగమయ్యిందని తనను పెళ్లి చేసుకోవాలనడంతో తర్వాత చేసుకుంటానని నమ్మించి వేరు కాపురం పెట్టాడు.

నెల రోజుల పాటు సంధ్యతో ఉన్న నాగార్జున ఆమెను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. అతను ఊరు వదిలి ఏటో వెళ్లిపోయాడు. దీంతో కట్టుకున్న వాడు దూరమై, ప్రేమించిన వాడు దూరమై సంధ్య బతుకు ఒంటరిగా మిగిలిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకొని కుటుంబం కోసం భర్త పనికి పోతే ఇటువంటి పాడు పని చేస్తదా అంటూ గ్రామస్తులు సంధ్య పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నాగార్జున తనను బెదిరించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని తనను వాడుకొని వదిలేశాడని సంధ్య విలపించింది. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్నందున భర్తకు ముఖం చూయించలేక పిల్లల్ని వదిలి వచ్చానంది. తనకు తప్పు తెలిసి వచ్చిందని పెద్ద మనస్సుతో భర్త క్షమించి తనను తీసుకెళ్లాలని వేడుకుంటుంది. సంధ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.