కిరాతకం…మహిళను చంపి గుండెతో కూర వండి కుటుంబసభ్యులకు భోజనం పెట్టిన యువకుడు!

మహిళను చంపి ఆమె గుండె ని కూరగా వండి అత్త కుటుంబానికి వడ్డించిన ఘటన కలకలం రేపుతోంది. ఈ భయంకరమైన సంఘటన అమెరికాలోని ఓక్లాహామాలో జరిగింది. 44 ఏళ్ల లారెన్స్ పాల్ ఆండర్సన్ అనే వ్యక్తి జైలు నుంచి విడుదలైన కొన్ని వారాల తర్వాత ఈ దారుణానికి పాల్పడ్డాడు. 2021 లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే…లారెన్స్ పాల్ అండర్సన్ 2017లో డ్రగ్స్ సరఫరా కేసులో అరెస్టయ్యాడు. అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఓక్లహోమా పర్డోన్ అండ్ పేరోల్ బోర్డ్ సిఫార్సు మేరకు గవర్నర్ కెవిన్ స్టిట్.. అతడి శిక్షను తొమ్మిదేళ్లకు కుదించారు. ఇక జనవరి నెలలో పెరోల్ మీద బయటకు వచ్చాడు. అప్పటి నుంచి లారెన్స్ పాల్ అండర్సన్ అనే వ్యక్తి తన అత్త మామ లియో పై, డెస్లీ పైతో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో ఒకరోజు తన ఇంటి పక్కన నివసిస్తున్న మహిళ అండ్రియా లేన్ బ్లాంకెన్‌షిప్‌ ను లారెన్స్ కత్తితో నరికి చంపేశాడు. ఆ తర్వాత ఆమె గుండెను తీసి.. ఇంటికి తీసుకొచ్చాడు.

ఆ గుండెను కోసి, బంగాళా దుంప ముక్కల్లో కలిపాడు. ఆ తర్వాత వాటితో కూర వండి దాన్ని తన అంకుల్, ఆంటీ, వాళ్ల మనవరాలికి ఆ కూర తినిపించారు. ఆ తరువాత వారిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర గాయాల తో మామ లియోపై, నాలుగేళ్ల పాప మరణించింది. అత్త డెస్లీ పై తీవ్రంగా గాయపడి అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికులు ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పాల్ అండర్సన్‌ను అరెస్ట్ చేశారు. విచారణలో అతడు తన నేరాన్ని ఒప్పుకున్నట్లు తెలిసింది. పోలీసుల విచారణలో అతడు వింత సమాధానాలు చెప్పాడు. దీంతో పోలీసులు అతడు ఈ హత్యలు డ్రగ్స్ మత్తులో చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.