ఎమ్మెల్యే కారు ఢీకొని ఇద్దరు మృతి (వీడియోలు)

హరికృష్ణ మరణించడంతో ఆయనను కడసారి చూసి నివాళులు అర్పించేందుకు ఒక ఎమ్మెల్యే ఆదరాబాదరాగా కారులో ప్రయాణిస్తున్నారు. వేగంగా దూసుకుపోతున్న కారు ఢీకొని ఇద్దరు మరణించారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది.

 

కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మరణించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. ఎమ్మెల్యే కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా, వేగంగా బండి నడపడంతో ఈ ఘటన గన్నవరం మండలంలోని కేసరపల్లి సమీపంలో జరిగింది.  

యాక్సిడెంట్ కేసు నుంచి తప్పించుకునేందుకు గన్ మెన్ తెలివిగా ఎమ్మెల్యే ని కారులో నుంచి బయటకు దించి ఆటోలో పంపిచారని ప్రత్యక్ష సాక్షుల ఆరోపిస్తున్నారు. 

కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు

విజయవాడ నుంచి గన్నవరం వస్తుండగా కేసరపల్లి సమీపంలో ఎదురుగా స్కూటీ మీద వస్తున్న వారిని కారు వేగంగా ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే పోతుల రామరావుకు ఎలాంటి గాయాలు కాలేదు.

కారు ప్రమాదం తాలూకు వీడియోలు కింద ఉన్నాయి.