Vallabhaneni Vamsi: కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి మరో షాక్.. రిమాండ్ పొడిగింపు!

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి జ్యుడీషియల్ రిమాండ్ పొడిగించబడింది. విజయవాడ న్యాయస్థానం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల మేరకు వంశీతో పాటు కేసులో ఇతర అరెస్టయిన ఏడుగురి రిమాండ్‌ను మే 13వ తేదీ వరకు పొడిగించారు. ఫిబ్రవరి 13న అరెస్టయిన వంశీ ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

ఈ కేసులో బాధితుడిగా ఉన్న సత్యవర్ధన్‌ 2023లో గన్నవరం టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. ఆ సమయంలో జరిగిన ఒక రాజకీయ ఘర్షణ అనంతరం వంశీ అనుచరులు అతడిని కిడ్నాప్ చేసి బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. అతడిని హైదరాబాద్, విశాఖపట్నం మధ్య కారులో తిరిపించారని, ఈ దర్యాప్తులో బయటపడింది. కిడ్నాప్‌కి సంబంధించిన కీలక ఆధారంగా పలు సీసీటీవీ ఫుటేజ్‌లు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.

కేసుకు మరో మలుపు రావడానికి కారణమైనది మంత్రి కొల్లు రవీంద్ర విడుదల చేసిన వీడియోలు. ఫిబ్రవరి 13న వంశీ అనుచరులు సత్యవర్ధన్‌ను తీసుకెళ్తున్న దృశ్యాలు వీడియోల్లో కనిపించడం కేసు విచారణకు కీలక బలాన్ని ఇచ్చింది. ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది మందిని అరెస్టు చేసిన పోలీసులు, మరికొంతమందిపై నిఘా ఉంచినట్లు సమాచారం.

ఇక రాజకీయంగా ఈ కేసు వేడి రాజేసింది. వంశీకి వ్యతిరేకంగా టీడీపీ నేతలు పదేపదే విమర్శలు చేస్తుండగా, వైసీపీ వర్గాలు మాత్రం దీనిపై స్పందించక పోవడం గమనార్హం. రిమాండ్ పొడిగింపుతో కేసు దర్యాప్తు మరింత లోతుగా జరగనుండగా, మిగిలిన నిందితుల నుంచి సమాచారం తీసుకునే దిశగా పోలీసులు ముందడుగేస్తున్నారు.

గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేసిన హీరో శోభన్ బాబు మనవడు| Actor Shoban Babu Grandson Dr. Surakshith | TR