Crime News:మంచిర్యాల జిల్లాలో దారుణం.. రూ 200 కోసం తల్లిని చంపిన తనయుడు ..!

Crime News: ఈ మధ్య కాలంలో డబ్బుకి ఉన్న విలువ బంధాలకు, బంధుత్వాలకు లేకుండా పోయింది. కొందరు దుండగులు డబ్బుల కోసం ఎటువంటి నీచానికైనా పాల్పడటానికి వెనకాడటం లేదు. ముఖ్యంగా యువత ఈ రోజుల్లో అక్రమంగా సులువైన మార్గాలు ద్వారా డబ్బులు సంపాదించి చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు.చెడు వ్యసనాలకు అలవాటు పడటం వల్ల డబ్బు కోసం కన్నవారిని కడతేర్చటానికి వెనుకాడటం లేదు. ఇటీవల మంచిర్యాల జిల్లాలో ఇటువంటి విషాదకరమైన ఒకటి సంఘటన చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే..మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్​లో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న కడమండ సత్తమ్మ (65) కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈమెకు ఒక కుమారుడు చంద్రశేఖర్, కుమార్తె లక్ష్మి ఉన్నాడు. అతను మద్యానికి బాగా అలవాటు పడి డబ్బు కోసం తరచూ సత్తమ్మ ను వేధిస్తూ ఉండేవాడు. కష్టపడి కూలి పనులు చేసి సంపాదించిన డబ్బును కొడుకు ఇలా తాగుడికి కర్చు చేసేవాడు. కన్న తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడే చెడు వ్యసనాలు అలవాటుపడి ఆమె కష్టాన్ని దోచుకుంటున్నాడు.

ఈ క్రమంలో శనివారం సత్తమ్మ కుమారుడు చంద్ర శేఖర్ డబ్బు కోసం వేధించాడు. ఆమె డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో తీర కోపానికి గురైన చంద్రశేఖర్ చాలా క్రూరంగా గొడ్డలి తో ఆమెపై దాడి చేశాడు. ఈ ఘటనలో సత్తమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఆమె కూతురు లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనకు పాల్పడిన చంద్రశేఖర్ నీ పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు.