భార్య మీద అనుమానంతో ఆ భర్త చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రస్తుత కాలంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోకపోవడం వల్ల ఇలాంటీ వివాదాలు తలెత్తడమే కాకుండా వివాహేతర సంబందాలు కూడా పెట్టుకుంటున్నారు. వివాహేతర సంబంధాల కారణంగా కుటుంబంలో గొడవలు జరగటమే కాకుండా పిల్లలకు తల్లిదండ్రులు దూరం అవుతున్నారు. అంతేకాకుండా ఈ వివాహేతర సంబంధాలు మనుషుల ప్రాణాలను కూడా బలి తీసుకుంటున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా భార్యాభర్తలు ఒకరినొకరు హత్యలు చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల ఎటువంటి దారుణ ఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్లో నిద్రిస్తున్న భార్యను నిద్ర లేపి మరి వేగంగా వస్తున్న రైలు కిందకు తోసేశాడు. ఈ దారుణ ఘటన కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే… మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా వాసాయి రోడ్ రైల్వే స్టేషన్‌లో సోమవారం తెల్లవారుజామున ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్లాట్ ఫామ్ పై ఆద మరచి నిద్రిస్తున్న భార్యను నిద్రలేపి వెంటనే ఆమె రెక్కలను బలంగా పట్టుకుని ప్లాట్‌ఫామ్ ఒడ్డుకు ఈడ్చుకెళ్ళాడు. ఆ సమయంలో వేగంగా వస్తున్న ట్రైన్ కిందికి తోసేశాడు. అయితే ఈ తతంగం మొత్తం రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

రెండు రోజులు క్రితం భార్య తన భర్త స్నేహితుడితో కలసి వెళ్ళిపోయింది. దీంతో భార్య మీద అనుమానం పెంచుకున్న భర్త ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ ఈ క్రమంలో ప్లాట్ ఫామ్ మీద నిద్రిస్తున్న భార్యను కళ్ళు ముక్కుని కళ్ళు తెరిచేలోపే వేగంగా వస్తున్నా రైలు కిందకు తోసేసి తన లగేజ్ తో పాటు ఇద్దరు పిల్లలుని తీసుకొని అక్కడి నుండి వెంటనే పారిపోయాడు. రైలు కింద పడిన భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పిల్లలని తీసుకుని అక్కడి నుండి పరారైన నిందితుడు దాదర్ ట్రైన్ ఎక్కాడు. తర్వాత అక్కడి నుంచి కల్యాణ్ చేరుకున్నాడు. సీసీ కెమెరాలో నిందితుడిని గుర్తించిన పోలీసులు వెంటనే రంగంలోకి తిరిగి సోమవారం రాత్రి జిల్లాలోని భివాండిలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అతడిని విచారించగా రెండు రోజుల క్రితం తన భార్య స్నేహితులతో కలిసి ఇంటి నుండి పారిపోయిందని వెల్లడించాడు. వారి మీద ఉన్న అనుమానం కారణంగానే నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు.