గుంటూరులో యువ జడ్జి ఐశ్వర్య హఠాన్మరణం

గుంటూరు జిల్లా నర్సరావుపేటలో యువ జడ్జి ఐశ్వర్య (25) హఠాన్మరణం చెందారు. శనివారం ఉదయం ఇంట్లో తల్లికి కాఫీ ఇస్తుండగా ఐశ్వర్య ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఐశ్వర్య నర్సరావుపేట పట్టణ 1వ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా పని చేస్తున్నారు. ఆమె కోర్టు బంగ్లాలోనే తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు.

శుక్రవారం ఐశ్వర్య ఇంట్లో కాలుజారి పడి అస్వస్థతకు గురయినట్టు తెలుస్తోంది. శనివారం ఉదయం తల్లికి కాఫీ ఇస్తూ ఆమె కుప్పకూలిపోయారు. ఐశ్వర్యకు ఇంకా వివాహం కాలేదు. చిన్న వయసులోనే ఉన్నత స్థానానికి చేరుకున్న ఐశ్వర్య హాఠాత్తుగా మరణించడం అందరిని కలిచి వేసింది. విషయం తెలుసుకున్న న్యాయవాదులు కోర్టు ప్రాంగణానికి చేరుకొని ఐశ్వర్యకు నివాళులు అర్పించారు.