Nanditha swetha: స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న ఢీ జడ్జి నందిత శ్వేతా… కారణం ఏమిటంటే?

Nanditha swetha: బుల్లితెర మీద ప్రసారమవుతున్న డాన్స్ షో లలో ” ఢీ” డాన్స్ షో మంచి ప్రేక్షకాదరణ పొందింది. గత కొన్ని సంవత్సరాలుగా సక్సెస్ ఫుల్ గా ప్రసారమౌతున్న ఈ డాన్స్ లో ప్రస్తుతం 14 వ సీజన్ నడుస్తోంది. ఈ షోలో ప్రదీప్ యాంకరింగ్ చేయగా హీరోయిన్లు ప్రియమణి, నందితా శ్వేత, గణేష్ మాస్టర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షో లో హైపర్ ఆది, రవికృష్ణ నవ్య స్వామి కూడా సందడి చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ రియాలిటీ డాన్స్ షో ద్వారా ఎంతో మంది డాన్సర్లు గా తమ కెరీర్ని ప్రారంభించారు.

ఈ వారం ప్రసారం కాబోయే ఢీ షో కి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ ప్రోమో లో డాన్సర్లు అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ.. ఇక హైపర్ ఆది ప్రదీప్ మధ్య జరిగిన ఫన్నీ డిస్కషన్స్ ఉన్నాయి. అయితే ఈ ప్రోమో చివరిలో హీరోయిన్ నందిత శ్వేత స్టేజ్ మీద కన్నీరు పెట్టుకుంది. అందుకు కారణం ప్రదీప్ చేసిన పని. నందిత శ్వేత పుట్టినరోజు సందర్భంగా ఢీ హోల్ టీం తరఫున ప్రదీప్ బర్త్ డే విషెస్ తెలియజేశాడు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ మీ పుట్టిన రోజు సందర్భంగా మ తరుపున మీకు ఒక స్పెషల్ అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పి ఒక గిఫ్ట్ బాక్స్ నందిత కి ఇచ్చాడు.

నందిత ఎంతో ఎక్సైటింగ్ గా గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేసి అందులో చూసి ఒక్కసారిగా అందరూ చూస్తుండగానే స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకుంది. నందిత అంత ఎమోషనల్ అవటానికి ఆ గిఫ్ట్ బాక్స్ లో ఏముంది అని ప్రేక్షకులలో ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. నందిత అంత ఎమోషనల్ అవ్వడానికి గల కారణం గురించి తెలియాలంటే మనం ఈ ఢీ షో ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది.