సిద్దిపేటలో భారీ అగ్ని ప్రమాదం

సిద్దిపేట పట్టణంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విక్టరీ చౌరస్తాలోని  ఓ వెదురు కర్రల దుకాణంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సమీపంలోని 20 దుకాణాలకు క్షణంలో మంటలు అంటుకున్నాయి.  దీంతో అప్రమత్తమైన షాపు నిర్వాహకులు వెంటనే బయటికి వచ్చారు. దీంతో పెద్ద ప్రాణ నష్టం తప్పింది. రూ. కోట్లల్లో ఆస్తినష్టం జరిగినట్టు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన షాపు పక్కకే ప్రైవేటు ఆస్పత్రి ఉంది. మంటలకు భయపడిన రోగులు, బంధువులు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంతో సిద్దిపేట-మెదక్ జాతీయ రహదారి పై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. స్థానికంగా ఒకటే ఫైర్ ఇంజన్ ఉండడంతో మంటలు అదుపు చేయడం కష్టంగా మారింది. సంగారెడ్డి, మెదక్ ల నుంచి మరిన్ని ఫైరింజన్లు తెప్పించారు. ఈ లోపు పూర్తిగా జరగాల్సిన నష్టం జరిగిపోయింది.