భార్య ఉండగా మరో మహిళతో పోలీసు సారు అక్రమ సంబంధం

అసిఫాబాద్ సీఐ రాజయ్య పై ఎల్బీ నగర్ పీఎస్ లో కేసు నమోదైంది. అక్రమ సంబంధం పెట్టుకొని తమను వేధిస్తున్నాడని రాజయ్య భార్య రేణుక ఫిర్యాదు చేసింది. 2009లో తనను ప్రేమ వివాహం చేసుకున్నాడని ఇప్పుడు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోని తమను పట్టించుకోవడం లేదని ఆమె వాపోయింది. 

రాజయ్య, రేణుక 2009లో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు. రాజయ్య ప్రస్తుతం ఆసిఫాబాద్ సీఐ గా పని చేస్తున్నారు. తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని రేణుక ఆరోపించింది. అక్రమ సంబంధం పెట్టుకొని తనను, ముగ్గురు పిల్లలను వదిలేశాడని తెలిపింది. ఇదేంటని నిలదీస్తే వేదిస్తున్నాడని తెలిపింది.

అనేక సార్లు చెప్పినా ఏం చేసుకుంటావో చేసుకోపో అని బెదిరించాడని, ఇక పోరు తాళలేకనే కేసు పెట్టానని తెలిపింది. తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని ఆమె కోరింది. ప్రేమించి పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నామని కానీ ఇలా ఎలా మారి పోయాడో అర్ధం కాలేదన్నారు. మూడు నెలల నుంచి ఇంటికి రావడమే మానేశాడని తాను, పిల్లలు బతకడం కష్టమైందన్నారు. అన్ని రకాలుగా చెప్పి చూసినా తాను మారలేదని తెలిపింది. అందుకే గత్యంతరం లేకే  కేసు పెట్టానని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది.