కార్పెట్ కంపెనీలో పేలుడు, 10 మంది స్పాట్ డెడ్

ఉత్తరప్రదేశ్ లోని భడోహీలోని కార్పెట్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో రెండతస్థుల భవనం కుప్పకూలింది. ఈ పేలుడులో 10 మంది కార్మికులు చనిపోయారు. కార్పెట్ తయారీ కంపెనీలో అక్రమంగా బాణసంచా తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.