హిమాయత్ నగర్ లో నడి రోడ్డు పై పల్సర్ బైక్ దగ్ధం

హిమాయత్ నగర్ లో నడి రోడ్డు పై పల్సర్ బైక్ తగలబడింది. ఓ వ్యక్తి తన బైక్ ను డ్రైవ్ చేసుకుంటూ వస్తుండగా హిమాయత్ నగర్ వద్దకు రాగానే బండి ముందు భాగం నుంచి మంటలు వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన ఆ వ్యక్తి బైక్ ను రోడ్డు పైనే వదిలేసి పక్కకు వెళ్లాడు. క్షణాల్లోనే బైక్ మొత్తానికి మంటలు అంటుకుని బైక్ పూర్తిగా కాలిపోయింది. దీంతో జనాలంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. బైక్ ఇంజన్ లో సమస్య వల్లనే మంటలు వచ్చినట్టుగా భావిస్తున్నారు.