40 ఏళ్లు వచ్చినా పెళ్లి చేయలేదని కోపం…. కన్నతల్లిని దారుణంగా నరికి చంపిన కొడుకు!

woman kills her own brother in guntur dist in ap

సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల కోరికలు నెరవేర్చడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే కొన్ని సందర్భాలలో అనుకున్న పనులు నెరవేరకపోవడం వల్ల పిల్లల కోరికలు తీర్చలేకపోతారు. పిల్లల చదువు దగ్గరినుండి వారి పెళ్లి చేసే వరకు తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా ఉంటారు. అయితే ఇక్కడ 40 ఏళ్లు దాటిన కూడా కొడుక్కి ఆ తల్లి పెళ్లి చేయకపోవడంతో ఆగ్రహానికి గురైన కొడుకు దారుణంగా తల్లిని హత్య చేసిన ఘటన జైపూర్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే…జైపూర్ జిల్లా కి చెందిన గోపాల్ అనే వ్యక్తి ఇటీవల తల్లిని హత్య చేసిన ఘటన సంచలనంగా మారింది. పెళ్లీడుకొచ్చిన గోపాల్ కి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎన్ని పెళ్లి సంబంధాలు చూసినా అవి కుదరకపోవడంతో గోపాల్ తన పెళ్లి గురించి ఆలోచిస్తూ తల్లిదండ్రులు తనకు పెళ్లి చెయ్యట్లేదని లోలోపల మదనపడుతూ ఉన్నాడు. ఇలా గోపాల్ కి ఇప్పుడు 40 ఏళ్లు. 40 ఏళ్లు వచ్చినా కూడా పెళ్లి కాకపోవటంతో గోపాల్ ఈ విషయంలో తరచూ పేరెంట్స్‌తో గొడవపడేవాడు.

ఈ క్రమంలో ఆదివారం కూడా గోపాల్ తన పెళ్లి గురించి తల్లిదండ్రులతో గొడవపడ్డాడు. తల్లిదండ్రులు కావాలనే తనకి పెళ్లి చేయడం లేదని గోపాల్ వారితో వాదించాడు. అయితే ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడం తమ తప్పు కాదని, పెళ్లి సంబంధం కుదిరే వరకు ఓపికగా ఉండాలని తల్లిదండ్రులు సమాధానం చెప్పారు. ఇలా తల్లిదండ్రులకి గోపాల్ కి మధ్య మాట మాట పెరిగింది. ఈ క్రమంలో గోపాల్ ఆగ్రహానికి గురై పదునైన ఆయుధంతో తన తల్లిని దారుణంగా పొడిచాడు. దీంతో 61 ఏళ్ల గోపాల్ తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేశారు. ఆ తర్వాత గోపాల్ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.