మిర్యాలగూడ మర్డర్ పై అమృత వర్షిణి చెప్పిన నిజాలివే (వీడియో)

మిర్యాలగూడెంలో జరిగిన పరువు హత్యలో పలు ఆసక్తికర నిజాలు వెలువడ్డాయి. భర్త హత్యతో కుప్పకూలి ఐసీయూలో చికిత్స పొందుతున్న అమృత వర్షిణి స్పృహలోకి వచ్చి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తన భర్త ప్రణయ్‌ని నాన్నే చంపాడని ఇందులో ఎటువంటి అనుమానం లేదంది. ప్రస్తుతం తను 5 నెలల గర్భవతినని నాన్న అనేక సార్లు అబార్షన్ చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడని తెలిపింది. కానీ దానికి తను ఒప్పుకోలేదంది. అమృత మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.

 

MIRYALAGUDA AMRUTHA VARSHINI RESPONDS PRANAY MURDER

 

 

AMRUTHA VARSHINI RESPONDS PRANAY ,MURDER1

 

నాన్న మారుతీరావు అనేక సార్లు ఇంటకి రమ్మన్నాడని కానీ ప్రాణ భయంతో తాను వెళ్లలేదన్నారు. తన బాబాయ్ శ్రావణ్ తనను కిందపడేసి కొట్టాడని, డంబెల్ తో కూడా కొట్టి బెదిరించాడని తెలిపింది. ప్రణయ్ తో మాట్లాడితే చంపేస్తానని బెదిరించారని వాపోయింది. నయీం బ్యాచ్ తోనే హత్య చేయాలని చూశారు. పెళ్ళి చేసుకొని వచ్చాక  పోలీసులు అందరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారని ఎటువంటి ఇబ్బంది పెట్టనని నాన్న చెప్పాడని తెలిపింది.

తాను ప్రెగ్నెన్సీ అన్న విషయాన్ని అమ్మకు చెప్పొద్దని నాన్న బెదిరించాడని రెండు నెలల తర్వాత అమ్మకు విషయం తెలిపానని అమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేదని అమృత తెలిపింది. మమ్ముల చాలా ఇబ్బందులు పెట్టి మారినట్టే మారిన నాన్న ఇంత ఘోరానికి ఒడిగడతాడని ఊహించలేదని విలపించింది. ప్రణయ్ ని ఒక్కసారి చూపించండంటూ భోరున విలపించింది. ప్రణయ్ ని హత్య చేస్తే తాను ఇంటికి వస్తాడని నాన్న భావించాడని అందుకే హత్య చేశారంది.

నాన్న నాకు ఆసుపత్రిలో ఉండగానే ఫోన్ చేశాడని కానీ కాల్ ఎత్తితే హాస్పిటల్ లో ఉన్నానని తెలుస్తుంది అని ఎత్తలేదని తెలిపింది. తాను ఎక్కడికి వెళ్ళినా నాన్నకు క్షణంలో విషయం తెలిసేందంది. ప్రణయ్ పై దాడి తర్వాత నాన్నకు ఫోన్ చేస్తే సరిగా వినిపించడం లేదు తర్వాత చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేశాడని వెంటనే డిఎస్పీ కి ఫోన్ చేసినా అతను లిఫ్ట్ చేయలేదని అమృత విలపించింది.