తల్లి వదిలేసి వెళ్లడంతో..అంగ వైకల్యంతో ఉన్న కుమార్తెను కాలువలో పడేసిన తండ్రి..?

సాధారణంగా భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు వారి పిల్లల మీద కూడా ప్రభావం చూపుతాయి. ప్రస్తుత కాలంలో ప్రతి చిన్న విషయానికి భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తాజాగా భార్యాభర్తల మధ్య మొదలైన గొడవ కారణంగా అంగవైకల్యంతో ఉన్న కుమార్తెను ఒక తండ్రి దారుణంగా హత్య చేసిన ఘటన కరీంనగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య చోటు చేసుకున్న గొడవతో అంగ వైకల్యం, మాటలు రాని చిన్నారిని ఆ తండ్రి కనికరం లేకుండా కాలువలో పడేశాడు .

వివరాలలోకి వెళితే…కరీంనగర్‌ రూరల్‌ మండలం తీగలగుట్టపల్లికి చెందిన కొరిమి మహేందర్‌ దంపతులకు ఒక కూతురు. అతను కూలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే కుమార్తె పుట్టిన ఆరు నెలలకు అనారోగ్య బారిన పడటంతో మెదడు నరాలు దెబ్బతిని చేతులు, కాళ్లు చచ్చుబడిపోయాయి. ఆసుపత్రుల్లో చూపించినా ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు.దీంతో అప్పులు బాధలు ఎక్కువ కావడంతో మహేందర్‌ మద్యానికి బానిసయ్యాడు. మద్యానికి బానిసైన మహేందర్ కూలి పనికి కూడా వెళ్లకపోవడంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలో ఫిబ్రవరి 25న రూరల్‌ పోలీసులకు భావన ఫిర్యాదు చేయడంతో వారు కౌన్సెలింగ్‌ చేసి ఇంటికి పంపించారు.

ఇక రెండు రోజుల కిందట మరోసారి గొడవ జరగడంతో కుమార్తెను భర్త వద్ద వదిలి ఆమె బంధువుల ఇంటికి వెళ్లింది. భార్య అలా వదిలేసి వెళ్లిపోవడంతో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన మహేందర్ అంగ వైకల్యంతో ఉన్న కుమార్తెను బుధవారం రాత్రి తిమ్మాపూర్‌ మండలం అల్గునూర్‌ కాకతీయ కాలువ వద్దకు తీసుకెళ్లి గొంతు నులిమి నీటిలో పడేసి తిరిగి ఇంటికి వచ్చాడు. అయితే చిన్నారి కనిపించకపోవడంతో అనుమానించిన స్థానికులు అతడిని అడగడంతో తెలియదని చెప్పాడు. దీంతో స్థానికులతో పాటు భావన కూడా పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు. మొదట ఏమీ తెలియదని బుకాయించిన అతను, గట్టిగా విచారణ చేయడంతో రాణి కుమార్తెను హత్య చేసే కాలంలో పడేసినట్లు నిజం అంగీకరించాడు. దీంతో పోలీసులు అతని మీద కేసు నమోదు చేసుకుని రిమాండ్ కి తరలించారు.