ఆస్తి కోసం తల్లీ పాలిట కాలయముడైన కొడుకు… ఏం చేశాడో తెలుసా వణికిపోతారు…?

ప్రస్తుత కాలంలో డబ్బుకి ఉన్న ప్రాధాన్యత విలువ మరే దానికి లేదు. డబ్బు కోసం బంధాలు బంధుత్వాలు అన్నీ మరిచిపోతున్నారు. ఆస్తుల కోసం తోడబుట్టిన వారు, కని పెంచిన తల్లిదండ్రులను కూడా దారుణంగా హత్యలు చేస్తున్నారు. తాజాగా ఆస్తికోసం కొడుకు కన్నతల్లి తల నరికి స్వయంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. ఈ దారుణ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

వివరాలలోకి వెళితే…జనగామ జిల్లా జనగామ మండలం మరిగడి గ్రామానికి చెందిన కూరాకుల రాజయ్య, రమణమ్మలకు కన్నప్ప, లావణ్య అని ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరికి పది ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. 10 సంవత్సరాల క్రితం రాజయ్య మరణించారు. ఇక కన్నప్ప స్థానికంగా సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తూ జీవిస్తున్నాడు. కుమార్తె లావణ్య తన భర్తతో గొడవపడి మూడు నెలలనుంచి తల్లి వద్దే ఉంటోంది. దీంతో కుమార్తెకు ఎలాంటి ఆధారం లేనందున ఉన్న భూమిలో కొంత ఇవ్వాలని తల్లి రమణమ్మ కొద్ది కాలంగా కుమారుడిని కోరింది. అయితే కన్నప్ప అందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో కన్నప్పకు తెలియకుండా గత నెల 30న లావణ్య పేరు మీద 4ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్‌ చేసింది.

ఈ విషయం తెలుసుకున్న కన్నప్ప మిగిలిన భూమిని తనకు ఇవ్వాలని తల్లిని కోరాడు. అయితే ఆమె అందుకు నిరాకరిస్తూ.. తాను బతికి ఉండగా ఆస్తిని ఇవ్వనని తెగేసి చెప్పింది. దీంతో తల్లి మీద కక్ష పెంచుకున్న కన్నప్ప గురువారం ఉదయం తన చెల్లి బయటకు వెళ్లిన సమయంలో తన వెంట తెచ్చుకున్న కత్తితో రమణమ్మ మెడపై నరికాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆ తర్వాత తలమండెం వేరుచేసి తలను పట్టుకొని ఇంటిముందు అటు ఇటు కాసేపు తిరిగి ఆ తర్వాత స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు.
దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కన్నప్ప మీద హత్యా నేరం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.