భార్యని హత్య చేసి ఆ తర్వాత భార్య శవానికి క్షుద్ర పూజలు చేసిన భర్త…?

ఈ ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ టెక్నాలజీ మీద ఆధారపడి ఉన్నారు. ఏ విషయం అయిన అరచేతిలో ఉన్న మొబైల్ తో ప్రపంచం లో జరిగే ప్రతి విషయాన్ని చిటికెలో తెలుసుకుంటారు. అయినప్పటికీ మారుమూల ప్రాంతాలలో నివసిస్తున్న నిరక్షరాస్యులు తో పాటు విద్యావంతులైన వారు కూడా మూఢ నమ్మకాలను నమ్ముతున్నారు. ఈ మూఢ నమ్మకాలను నమ్ముతూ దొంగ బాబాల చేతుల్లో దారుణంగా మోసపోతున్నారు. అంతే కాకుండా మరికొంత మంది క్షుద్ర పూజల పేరుతో హత్యలు చేయటానికి కూడా వెనకాడటం లేదు. ఈ క్రమంలో ఒక భర్త కట్టుకున్న భార్యను హత్య చేసి క్షుద్ర పూజలు చేసిన ఘటన స్థానికంగా సంచలనం శృష్టించింది.

వివరాల్లోకి వెళితే ఈ ఘటన ఒడిశా రాష్ట్రం లోని ఢెoకనల్ జిల్లా పరజంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబపలసలో గ్రామంలో చోటుచేసుకుంది. శనివారం గ్రామ శివారులోని నేర్పిన ప్రాంతంలో తమ గ్రామానికి చెందిన మమత అనే మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అంతేకాకుండా మృతదేహం చుట్టూ క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఉండడాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలిపారు.

గ్రామస్తులు అందించిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శవాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. స్థానికులను విచారించిన పోలీసులు మృతురాలి భర్త పై అనుమానం రావటంతో ఆమె భర్త అష్టమ ఖటువ ను అదుపులోకి తీసుకొని విచారించగా… శుక్రవారం రాత్రి తన భార్యను హత్య చేసి… తానే క్షుద్ర పూజలు చేసినట్టుగా పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందతుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. అసలు మమత ని భర్త ఎందుకు హత్య చేసాడు? అనే దిశగా దర్యాప్తు ప్రారంభించారు.