బ్రేకింగ్ న్యూస్: టిటిడి బోర్డు సంచలన నిర్ణయం

టిటిడి బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలలో మహాసంప్రోక్షణ సందర్బంగా తొమ్మిది రోజుల పాటు స్వామి దర్శనం నిలిపివేయాలని బోర్డు నిర్ణయించింది. ఆగష్టు 9 నుంచి 17 వరకూ తిరుమలలో భక్తులకు దర్శనం నిలిపివేస్తున్నట్టు టిటిడి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. టిటిడి ఆలయ అధికారుల అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ సంప్రోక్షణలో 30వేల మంది భక్తులకు అవకాశం కల్పిస్తామని చైర్మన్ తెలిపారు. తొమ్మిది రోజుల పాటు భక్తులను కొండపైకి అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. టిటిడి నిర్ణయంపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టిటిడిలో వివాదాలు జరుగుతున్న సమయంలో అధికారులు, బోర్డు తీసుకున్న నిర్ణయంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.