Aadavallu Meeku Johaarlu : ట్విట్టర్ రివ్యూ : “ఆడవాళ్లు మీకు జోహార్లు” టాక్..బాబోయ్ ఆ రేంజ్ లో ఉందా?

Aadavallu Meeku Johaarlu

Aadavallu Meeku Johaarlu : ఈవారం టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ ని హిట్ చెయ్యడానికి వస్తున్న చిత్రాల్లో మరో యంగ్ హీరో శర్వానంద్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “ఆడవాళ్లు మీకు జోహార్లు” కూడా ఒకటి. ప్రముఖ దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రం కూడా మంచి ప్రమోషన్స్ తోనే వచ్చింది.

అలాగే దాదాపు 15 కోట్ల టార్గెట్ తో వచ్చిన ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్ గా నటించగా సీనియర్ నటీమణులు రాధికా, ఖుష్బూ తదితరులు నటించారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ సినిమా కూడా ఎర్లీ ప్రీమియర్స్ తోనే స్టార్ట్ అయ్యింది.

మరి ఈ సినిమాకి ట్విట్టర్ ప్రజానీకం ఎలాంటి రివ్యూస్ ఇచ్చారో తెలుస్తుంది. మొదటగా మన ప్రేక్షకుల కోసం ముఖ్యంగా యూత్ లో టాక్ చూసుకుంటే నిర్మొహమాటంగా సినిమా బాలేదని చెప్పేస్తున్నారు. దర్శకుడు కిషోర్ తీసిన సినిమా “నేను శైలజ” మళ్ళీ తిప్పి తీసినట్టు ఉందని చెప్తున్నారు.

అలాగే ఇన్సైడ్ రిపోర్ట్స్ లో అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ కి ఈ సినిమా పర్వాలేదనిపిస్తుందట. సినిమాలో కామెడీ మరియు ఎమోషన్స్ బాగున్నాయని అంటున్నారు. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుందట కానీ డీఎస్పీ పాటలు దెబ్బేసాయట.

ఇంకా ఈ సినిమాని ఓటిటి కి ఇచ్చేసుకుంటే బాగుండని అంటున్నారు. కానీ అల్టిమేట్ గా అయితే ఫ్యామిలీ ఆడియెన్స్ గాని సినిమా నచ్చితే ఎవరూ ఏం చెయ్యలేరు మరి శర్వానంద్ ని వారే కాపాడుతారా లేక మళ్ళీ తన ఖాతాలో ఇంకో ప్లాప్ పడుతుందా అనేది వేచి చూడాలి.

Aadavallu Meeku Johaarlu Twitter Review: