‘పడి పడి లేచె మనసు’టాక్ ఏంటి ఇంత తేడాగా?

డైరక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ఈ రోజు రిలీజ్ అవుతున్న ఈ చిత్రంపై అంచనాలయితే బాగా ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ చిత్రం షోలు అమెరికా లో పడ్డాయి. అక్కడ నుంచి అందుతున్న రిపోర్ట్ మాత్రం కాస్త తేడాగానే ఉంది. శర్వానంద్ అభిమానులు నిరాశపడేలా ఉంది.

అక్కడ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. కథ నేపాల్ లో మొదలవుతుంది. అక్కడ ఓ పోలీస్ కు సూర్య (శర్వానంద్) కథ చెప్పటం మొదలెడతాడు. ప్లాష్ బ్యాక్ లో కథ కొల్ కతా కు షిప్ట్ అవుతుంది. అక్కడ సూర్యకు, కొరియోగ్రాఫర్ రాజు సుందరం గ్యాంగ్ కు మధ్య చిన్న ఫన్నీ ఫైట్ తో కథలోకి ఎంటరవుతుంది. సాయి పల్లవి పాత్ర పేరు వైశాలి. ఆమె ఇంట్రడక్షన్ ఓ మాంటేజ్ సాంగ్ తో మొదలవుతుంది. పాట చాలా బాగుంది.

తర్వాత సూర్య,సాయిపల్లవి మధ్య పరిచయం , కమిడయన్ ప్రియదర్శితో కన్నని సీన్స్ బాగానే వర్కవుట్ చేసారు. వైశాలి, సూర్య ప్రేమలో పడటం జరుగుతుంది. సూర్య ప్రపోజల్ ని ఆమె ఏక్సెప్ట్ చేస్తుంది. అక్కడ అనుకోని ఓ ట్విస్ట్ తో ఇంట్రవెల్ వస్తుంది. అక్కడ నుంచి సూర్య ఆమెను మళ్లీ ప్రేమలో పడేయ్యాలని ప్రయత్నిస్తూంటాడు. చివర్లో అబరప్ట్ గా సినిమా ముగుస్తుంది.

ఫస్టాఫ్ బాగుంది. కానీ ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి డల్ అయ్యిపోయింది. మళ్లీ సెకండాఫ్ ఇంట్రస్టింగ్ నోట్ తో స్టార్టైంది కానీ మళ్లీ డ్రాప్ అవుటం మొదలయ్యి..క్లైమాక్స్ కు వచ్చేసి పూర్తి బోర్ గా మారిపోయిందంటున్నారు.ఎత్తుకున్న కాంప్లిక్ట్ పాయింట్ ఆకట్టుకునేలా చెప్పలేకపోవటం, క్లైమాక్స్ అర్దాంతరంగా ముగియటం సినిమాకు మైనస్ గా మారిందంటున్నారు. అయితే ఈ టాక్ ఎంతవరూ నిజం అనేది తెలియాలంటే రివ్యూ వచ్చే దాకా ఆగాల్సిందే.

సుధాకర్ చెరుకూరి నిర్మాణ సారధ్యంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. జనాల్లో శర్వానంద్, సాయి పల్లవిలకు ఉన్న క్రేజ్ తో సినిమా పై అంచనాలు క్రియేట్ అయ్యాయి. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర లిరికల్ సాంగ్స్ విశేషంగా ఆకట్టుకోవడంతో.. ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. సినిమాను డిసెంబరు 21న రిలీజ్ చేస్తున్నారు.