‘సాహో’, ‘సైరా’: దేనికి క్రేజ్ ఎక్కువ?!

తెలుగు ప్రేక్షకులు, సినిమా లవర్స్ రెండు సినిమాలు గురించి ఎక్కువ గా మాట్లాడుతున్నారు..ఎదురుచూస్తున్నారు. ఆ రెండు సినిమాలే సాహో, సైరా. ఈ రెండు సినిమాల గురించి రోజూ సోషల్ మీడియాలో ఓ రేంజిలో చర్చ జరుగుతోంది. అంతేకాదు మీడియాలో సైతం ఈ సినిమా గురించి వచ్చే డైలీ అప్ డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ ఉంది అనే చర్చ మొదలైంది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కు తోన్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ కోసం మెగా అభిమానులే గాక సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ సినిమా హక్కుల కోసం భారీ డిమాండ్ పెరిగింది. ఈ సందర్భంలో ఓ వార్త ట్రేడ్ వర్గాలను షాక్ కు గురి చేస్తూ .. రీసెంట్ గా ఈ సినిమా కన్నడ హక్కులను చిత్ర యూనిట్ భారీ మొత్తానికి అమ్మేసింది.

తెలుగు సినిమాలకు కర్ణాటకలో మంచి ఆదరణ లభిస్తుండటం, మెగాస్టార్ చిరంజీవికి మంచి ఫాలోయింగ్ ఉండటంతో బాటు కన్నడ స్టార్ ‘కిచ్చ’ సుదీప్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుడటంతో ఈ సినిమాకి భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రముఖ పంపిణి సంస్థ ఈ సినిమా కన్నడ హక్కుల కోసం 35 కోట్లు ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది.

మరో ప్రక్క ప్రభాస్ ‘సాహో’ సినిమా కన్నా ‘సైరా’కే కన్నడ నాట ఎక్కువ బిజినెస్ జరగడం సినీ వర్గాలను సైతం షాక్ కు గురి చేసింది. అయితే మిగతా ఏరియాల్లో సాహో సినిమాకు క్రేజ్ ఓ రేంజిలో ఉండి, సైరాని దాటింది. ఇలా రెండు సినిమాలు క్రేజ్ విషయంలోనూ , బిజినెస్ విషయంలో పోటా పోటీగా ఉన్నాయి. సీనియర్ హీరో చిరంజీవి, యంగ్ హీరో ప్రభాస్ మధ్య ఇలా ఆరోగ్యకరమైన పోటీ ఏర్పడింది.

రెండు సినిమాలకు భారీగా ఖర్చుపెడుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం హాలీవుడ్ నిపుణులు పని చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్స్ ఈ రెండు సినిమా స్థాయి ఏమిటో చాటి చెప్పాయి.