‘సాహో’ రిలీజ్ కు హీరోయిన్ వైపు నుంచి షాకింగ్ ట్విస్ట్

‘సాహో’ రిలీజ్ కు హీరోయిన్ వైపు నుంచి కొత్త ట్విస్ట్

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ – ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ చిత్రం సాహో. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు 250 కోట్లతో ఈ సినిమాని రూపొందించారు. బాహుబలి వంటి చారిత్రాత్మక విజ‌యం సాధించిన చిత్రం తరువాత ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా కావ‌డంతో సాహో సినిమా పైన దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ఏర్పడింది. ప్రభాస్‌కి ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని అదే స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కించారని ట్రైలర్స్ , విడుదలై ఈ సినిమా మేకింగ్‌ వీడియో ద్వారా అర్దమైంది. వీటిన్నటికి సూపర్బ్‌ రెస్పాన్స్‌ రావటంతో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అయితే ఇప్పుడా సినిమాకు శ్రద్దా కపూరే సమస్యగా మారిందంటున్నారు.

శ్రద్దా కపూర్ హీరోయిన్ గా చేసిన బాలీవుడ్ చిత్రం చిచ్చోరే అదే తేదీన విడుదల కు రెడీ చేసారు. బ్లాక్ కామెడీగా రూపొందిన ఆ చిత్రాన్ని నితేష్ తివారి డైరక్ట్ చేసారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ హీరోగా చేసిన పోలిశెట్టి నవీన్ ఈ సినిమాలో కీ రోల్ చేసారు. ఈ సినిమాపై బాలీవుడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే ఈ దర్శకుడు గతంలో సూపర్ హిట్ చిత్రం దంగల్ డైరక్ట్ చేసారు.

అప్పటికీ శ్రద్దాకపూర్ తన చిత్రంసాహో తో క్లాష్ వద్దని దర్శక,నిర్మాతలకు చెప్పినట్లు సమాచారం. డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడి విడుదల తేదీ మార్చే అవకాసం ఉందేమో అని చూస్తున్నారట. కుదరకపోతే సాహో రిలీజ్ రోజే ఈ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. తెలుగులో ఇబ్బంది లేదు కానీ హిందీలో మాత్రం సాహో కు పోటీ ఇస్తుంది. దేశ విదేశాల్లో భారీ ఎత్తున చిత్రీకరించిన సాహో సినిమాను తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేయ‌నున్నారు.