‘సాహో’అసలైన అగ్ని పరీక్ష ఈ రోజే

‘సాహో’ఈ రోజు నుంచే అసలు కథ మొదలు

బాహుబలి చిత్రం తర్వాత అదే స్దాయిలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ‘సాహో’ . ఈ సినిమా మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ప్రేక్షకుల నుండి మొదటి రోజు నుంచి డివైడ్ టాక్ వచ్చింది.

రివ్యూలు నెగటివ్ గా ఉన్నా నార్త్ లో మాత్రం ఈ సినిమాకి విపరీతమైన క్రేజ్ నెలకొంది. టాక్ సంగతి ఎలా ఉన్నా కలెక్షన్లు మాత్రం కొదవలేదు. అయితే అందుకు కారణం … ఈ సినిమాకి దక్కిన ప్రీ రిలీజ్ హైప్. ఆ హైప్‌తోనే ఈ సినిమాకి భారీగా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జరిగాయి. అందుకే సినిమా టాక్ ఎలా ఉన్నా సినిమా కలెక్షన్స్‌కు మాత్రం పెద్దగా ఎఫెక్ట్ కాలేదు.

అంతే కాదు ‘బాహుబలి’ రెండు సినిమాలతో నార్త్ ఆడియన్స్ అంతా ప్రభాస్‌కి కనెక్ట్ అయిపోవటం కలిసొచ్చింది. అందుకే ఈ సినిమా అక్కడ భారీగా వసూళ్లు రాబడుతుంది. మొత్తంగా సినిమా మొదటి మూడు రోజులకు గాను రూ. 294 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది అని నిర్మాతలే ప్రకటించారు. అయితే ఇన్ని రోజులు ఒకెత్తు ..ఈ రోజు నుంచి కలెక్షన్స్ ఎలా ఉంటాయనేదానిపై సినిమా అసలు రిజల్ట్ ఏంటనేది ఆధారపడి ఉంటుంది.

అయితే ఈ సినిమా ఇప్పటిదాకా ఫాల్ అనేది లేదు. అయితే రికార్డ్ రేట్లకు డిస్ట్రిబ్యూటర్స్ సినిమాని అడ్వాన్స్ బేసిస్ లో తీసుకోవటంతో మరో రెండు వారాలు పాటు ఇదే పరిస్దితి కొనసాగాలి. అందుకు ఈ రోజే నాంది పలకాలి. అప్పుడే అందరూ సేవ్ అయ్యి..లాభాల్లో పడతారు. అప్పుడు సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ క్రింద లెక్క. ఇప్పటికే ఈ సినిమా హిందీ వెర్షన్ హిట్ క్రింద డిక్లేర్ అయ్యిపోయింది. హిందీ వెర్షన్ …వందకోట్లు క్లబ్ లో ఈ రోజు చేరనుంది .