వెట‌ర‌న్ మృతితో విషాదంలో టాలీవుడ్

tollywood

బాలీవుడ్ వెట‌ర‌న్ న‌టుడు రిషీ క‌పూర్ మర‌ణంతో బాలీవుడ్ స‌హా టాలీవుడ్ విషాదంలో మునిగిపోయాయి. రిషీ క‌పూర్ తో టాలీవుడ్ న‌టుల‌కున్న అనుభంధాన్ని గుర్తు చేసుకుంటూ క‌న్నీటి ప‌ర్యంతం అవుతున్నారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా నివాళులు అర్పిస్తున్నారు. టాలీవుడ్ ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు, హీరోలు, సాంకేతిక నిపులు, హీరోయిన్లు అంతా రిషీ క‌పూర్ మ‌ర‌ణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేసారు. ప్ర‌ముఖ న‌టుడు ఇర్పాన్ ఖాన్ క‌న్నుమూసి 24 గంట‌లు అయినా గ‌డ‌వ‌కముందే మ‌రో మ‌ర‌ణం చోటు చేసుకోవ‌డంతో అంతా మ‌నో వేద‌నకు గుర‌వుతున్నారు.

రిషీజీ మ‌ర‌ణ వార్త విన్న అనంత‌రం మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. రిషీకపూర్‌ మరణం తీరని లోటు. గొప్ప స్నేహితుడు, గొప్ప ఆర్టిస్ట్‌.. అలాగే ఎన్నో లక్షల మంది హృదయ స్పందన. ఆయన మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. రిషీకపూర్‌ మరణం నన్ను కలిచివేసింది. ఆర్‌ఐపీ.. మై డియరెస్ట్‌ ప్రెండ్ అని రజినీకాంత్ అన్నారు. అలాగే న‌టుడు పవన్ కళ్యాణ్ , రిషి కపూర్ అకాల మరణానికి విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం ఇండియన్ సినిమాకు తీరని లోటని ఆవేదన చెందారు. రిషి కపూర్ ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబాన్ని మనోధైర్యం ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. రిషి కపూర్ అకాల మరణానికి బాలీవుడ్ చిత్ర పరిశ్రమతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఆయన మరణానికి అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు..నిన్న అత్యతం ట్యాలెంట్‌ కలిగిన ఇర్ఫాన్‌ ఖాన్‌ను, నేడు లెజండరీ రిషీకపూర్ సాబ్‌ను కోల్పోవడం హార్ట్‌ బ్రేకింగ్‌ ఉంది. ఇది భారత చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని జూనియర్‌ ఎన్టీఆర్ అన్నారు. రిషీకపూర్‌ జీ ఇక లేరనే వార్త గుండెను కలిచివేసింది. ఇండియన్‌ సినిమాకు చెందిన మరో గొప్ప వ్యక్తి నేడు మనల్ని విడిచి వెళ్లిపోయారు అని కపూర్‌ కుటుంబానికి రామ్ చ‌ర‌ణ్ సంతాపం తెలిపారు. మరోకమైన అందమైన రెక్క రాలిపోయింది. ఆర్‌ఐపీ లెజెండ్‌ రిషీకపూర్ అని సుధీర్‌ బాబు అన్నారు. ఇది చాలా విషాదం నింపింది. 24 గంట్లోనే ఇద్దరు దిగ్గజాలను కోల్పోవడం షాక్‌కు గురిచేసింది. సినీ పరిశ్రమకు ఇది తీరని లోటు. వారి సినిమాల ద్వారా వారు జీవించే ఉంటారు అని నందమూరి కల్యాణ్‌రామ్ అన్నారు.