సుషాంత్ కేసులో కీల‌క మ‌లుపు.. ఇంత‌కీ 15 కోట్లు ఏమ‌య్యాయ్..?

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణానికి సంబంధించిన కేసులో మ‌రో మ‌లుపు చోటుచేసుకుంది. సుశాంత్‌ మృతిపై ఆయన తండ్రి కృష్ణకుమార్‌ సింగ్‌ పోలీసులను ఆశ్రయించి, సుశాంత్‌ స్నేహితురాలు రియా చక్రవర్తి పై ఫిర్యాదు చేయ‌గా, ఆమె పై పాట్నాలోని రాజీవ్ నగర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ క్ర‌మం‌లో లాక్‌డౌన్‌కు ముందు సుశాంత్ అకౌంట్ నుంచి 15 కోట్లు ట్రాన్స్‌ఫ‌ర్ అయిన‌ట్లు విచార‌ణ‌లో భాగంగా పోలీసులు గుర్తించారని తెలుస్తోంది.

అలాగే సుశాంత్‌కు సంబందించిన ఆర్థిక అంశాలతో పాటు ఇతర విషయాలను రియా స్వయంగా పర్యవేక్షించినట్లు స‌మాచారం. ఈ క్ర‌మంలో సుశాంత్‌కు స‌బంధించిన ల్యాప్‌టాప్‌, క్రెడిట్‌​ కార్డు, లిక్విడ్ క్యాష్‌తో పాటు ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు రియా వ‌ద్ద ఉన్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం ముంబై పోలీసులు రియాతో పాటు మ‌రో ఐదుగురిని విచారిస్తున్న నేప‌ధ్యంలో ఇంకెన్ని విషయాలు బ‌య‌ట‌ప‌డ‌తాయో చూడాలి. ఇక మ‌రోవైపు రియా చ‌క్ర‌వ‌ర్తి ముందస్తు బెయిల్ కోసం ప్ర‌య‌త్నిస్తోంద‌ని స‌మాచారం.