అంత పెద్ద ఫ్లాఫ్ ఇచ్చినా అదే హీరోతో మళ్లీ రకుల్…

రకుల​ ప్రీత్‌ సింగ్‌ కెరీర్ ప్రారంభంలోనే తెలుగులో వరుస అవకాశాలతో స్టార్‌ హీరోలతో నటించి క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అయితే మహేష్ తో చేసిన స్పైడర్ తర్వాత కాస్త వెనకబడిందనే చెప్పాలి. ఆ తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు. అయితే ఆమె ఇప్పుడు కోలీవుడ్ ,బాలీవుడ్ లపై దృష్టి పెట్టింది.

హిందీ సినిమాతోనే హీరోయిన్ గా పరిచయం అయిన రకుల్‌ రీసెంట్ గా అయ్యారితో మరోసారి ఆకట్టుకుంది. తాజాగా మరో హిందీ మూవీకి రకుల్‌ సైన్‌ చేసింది. సిద్ధార్థ్‌ మల్హోత్రా, రితేష్‌ దేశ్‌ముఖ్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న మర్జావాన్‌ సినిమాతో రకుల్‌ హీరోయిన్‌గా నటించనుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రకుల్ తన అభిమానులకు తెలియచేసింది.

సిద్ధార్థ్ మల్హాత్రాతో రెండో సారి రకుల్ జత కట్టడంతో బాలీవుడ్ మీడియా రకరకాల రూమర్స్ అల్లేసే పనిలో పడింది. మొదట అయ్యారి సినిమాలోనూ కనిపించిన ఈ జంట..ఆ సినిమా వర్కవుట్ కాకపోవటంతో మళ్లీ కలిసి పనిచేయరనుకున్నారు.

కానీ అందరి అంచనాలను తారు మారుచేస్తూ.. మిలప్‌ జవేరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మర్జావాన్‌ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాను టీ సిరీస్‌తో కలిసి నిఖిల్‌ అద్వాని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది.

ఇక తెలుగులో ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ‘ఎన్టీఆర్‌ బయోపిక్‌’లో శ్రీదేవి పాత్రలో నటిస్తోన్న సంగతి తెల్సిందే. తమిళంలో కార్తీ హీరోగా రూపొందుతోన్న ‘దేవ్‌’, సూర్య హీరోగా తెరకెక్కుతోన్న ‘ఎన్‌జికె’, శివ కార్తికేయన్‌ హీరోగా నటిస్తోన్న సినిమా.. ఇలా రకుల్‌ కెరీర్‌ కాస్త బిజీగానే వుంది‌