ఐసీయు లో నిర్మాత… కంట తడిపెట్టిస్తున్న మెసేజ్!

బాలీవుడ్ హీరోయిన్ కంగ‌న రనత్ న‌టించిన చిత్రం మ‌ణిక‌ర్ణిక‌- ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ. క్రిష్ – కంగ‌న సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం రిలీజ్ కు రెడీ అయ్యింది. క‌మ‌ల్ జైన్ నిర్మాత‌. ఈ చిత్రానికి జీ స్టూడియోస్ సంస్థ ఫైనాన్సియల్ సపోర్ట్ ఇచ్చింది. ఇక ఇప్పటికే రిలీజైన ట్రైల‌ర్ కి ద్భుత స్పంద‌న వ‌చ్చింది. ఈనెల 25న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ‌వుతోంది. స‌రిగ్గా రిలీజ్ కి వారం ముందు చిత్ర‌నిర్మాత ఊహించ‌ని రీతిలో గుండె పోటుకు గుర‌వ్వ‌డం, అటుపై ఐసీయులో వెంటిలేట‌ర్ పై ఉన్నారనే వార్త చిత్ర‌యూనిట్ లో తీవ్ర క‌ల‌త‌కు కార‌ణ‌మైంది.

ఆ వార్త ఏమిటంటే… మణికర్ణిక నిర్మాత జైన్ ప్ర‌స్తుతం వెంటిలేట‌ర్ పై ఉన్నారు. గుండె పోటు వ‌ల్ల అత‌డు ప‌క్ష‌వాతానికి గుర‌వ్వ‌డంతో ఈ సీరియ‌స్ స‌న్నివేశం నెల‌కొందిట‌. ఆయ‌న ఆస్ప‌త్రి నుంచే పంపించిన ఓ సందేశం చిత్ర‌యూనిట్ ని ఉద్దేశించి పంపారు. ఆ సందేశం కంట‌త‌డికి గురి చేసింద‌ని చెబుతున్నారు.

రెండేళ్ల పాటు ఎంత‌గానో శ్ర‌మించి ఇప్పుడు సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ఈ స‌మ‌యంలో నేను ఆస్ప‌త్రి లో ఉండ‌డం ఇబ్బంది క‌ర‌మే. అయినా స‌క్సెస్ ని ఎంజాయ్ చేయండి. ప్ర‌మోష‌న్స్ తో మ‌ణిక‌ర్ణిక చిత్రాన్ని జ‌నాల‌కు బాగా చేరువ చేశారు. నేను త్వ‌ర‌గానే కోలుకుని వ‌స్తాను.. జైహింద్ .. అంటూ క‌మ‌ల్ జైన్ యూనిట్ కి సందేశం అందించారు. ఇది నిజంగా తీవ్రంగా క‌ల‌చివేసే బాధాకరమైన విషయమే.

అయితే జనం చెప్పుకుని, సానుభూతి వ్యక్తం చేసేటంత సీరియస్ గా ఏమీ లేదని, కేవలం చెస్ట్ పెయిన్ తో హాస్పటిల్ లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని, రిలీజ్ సమయంలో తన యూనిట్ కు పంపిన మెసేజ్ కు జనం ఎక్కువగా స్పందిస్తున్నారని కొందరంటున్నారు. ఏది నిజమనేది..జైన్ అఫీషియల్ గా ప్రకటిస్తే కానీ తెలియదు.