లైంగిక ఆరోపణ వివాదం, రకుల్ ప్రీత్‌ సినిమాకు సమస్య

సౌత్ లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకొనే పనిలో పడింది. ఈ సారి సీనియర్ హీరో అజయ్ దేవగన్‌తో దేదే ప్యార్ దే అంటూ జతకట్టింది. రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందిన ఈ సినిమా ట్రైలర్లు, వీడియో సాంగ్స్ రిలీజై సినీ అభిమానులను బాగానే ఎట్రాక్ట్ చేసినా బిజినెస్, రిలీజ్ విషయం వచ్చేసరికి సమస్య ఎదురైంది. అందుకు కారణం..ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు అలోక్ నాథ్ నటించటమే.

మీ టూ ఆరోపణలు ఎదుర్కొంటున్న అలోక్ నాథ్‌ ఈ సినిమా చేయటంతో రిలీజ్ కు సమస్య అవుతోంది .ఈ సినిమాలో అలోక్ నాథ్‌ను తీసుకోవడంపై చాలా మంది బాహాటంగానే మండిపడుతున్నారు. అయితే మీ టూ వివాదంలో ఇరుక్కొనక ముందుగా అలోక్ నాథ్‌ను తీసుకోవడం జరిగిందనే వాదనను చిత్ర యూనిట్ వినిపించింది.

అయితే లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న అలోక్ నాథ్‌ను బూచీగా చూపి దే దే ప్యార్ దే, మై భీ అనే చిత్రాలను కొనడానికి బయ్యర్లు వెనకడాతున్నారు. దాంతో నిర్మాత ఏం చేయాలో అర్దం కని పరిస్దితి లో పడ్డారు. అలోక్ నాథ్ కారణంగా నిర్మాత భారీ మూల్యమే చెల్లించుకొనే పరిస్థితి ఏర్పడుతున్నదనే మాట వినిపిస్తున్నది. అలోక్ నాథ్‌పై ఆరోపణలు రావడానికి ఏడాదికి ముందే ఈ సినిమా పూర్తయింది. ఆ తర్వాత రేప్ ఆరోపణలు అలోక్‌పై రావడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. నా సినిమాకు, అతడిపై వచ్చిన ఆరోపణలకు సంబంధం లేదని నిర్మాత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ఈ సినిమాలోని అజయ్, రకుల్ ప్రీత్ సింగ్ మధ్య కెమిస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది. దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించుకొన్న ఈ చిత్రాన్ని కొనుగోలు చేయడానికి బయర్లు వెనుకాడటంపై బాలీవుడ్‌లో భారీ చర్చ జరుగుతున్నది. అందుకు కారణం ఏమిటంటే..బాలీవుడ్‌లో గతంలో నటించిన రెండు చిత్రాలు నిరాశ పరచడంతో ఈ సారి రకుల్ గట్టి ప్రయత్నంతో ముందుకొచ్చింది. దే దే ప్యార్ దే చిత్రంతో హాట్ హాట్ సన్నివేశాలతో రెచ్చిపోయింది.

ఈ చిత్రంలో 50 సంవత్సరాల అజయ్ దేవగన్‌కు ప్రియురాలిగా నటించడం చెప్పుకోదగ్గ విషయం. దే దే ప్యార్ దే ట్రైలర్‌లో మరో సన్నివేశంలో ఒక్కసారి పడుకొంటే ప్రేమ పుడుతుందా అంటూ రకుల్ అడిగే తీరు సినీ ప్రేమికులను ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదల చేసిన తూ మిలా తో హైనా అనే పాటలో వీరిద్దరి కెమిస్ట్రీ హాట్ టాపిక్‌గా మారింది ఈ పాటలో అజయ్ దేవగన్, రకుల్ ప్రతీ సింగ్ మధ్య రొమాన్స్ తారాస్ఠాయికి చేరుకొంది అంటున్నారు.