హాట్ ఫొటో: బోయ్ ఫ్రెండ్ కోసం.. బోల్డ్ గా తయారైంది

దిశా పటానీ, టైగర్‌ ష్రాఫ్‌లు డేటింగ్‌లో ఉన్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి మధ్య రిలేషన్ ఇటీవల చెడిందని బాలీవుడ్ లో గత కొద్ది రోజులుగా గుప్పు మంది. అయితే అలా వచ్చిన వార్తలకు ఈ జంట బ్రేక్‌ వేసింది. వీరిద్దరు కలిసి రీసెంట్ గా ముంబైలోని ఓ రికార్డింగ్‌ స్టూడియోలోకి చేరుకుంటూ తమపై వచ్చిన రూమర్సే అంటూ కొట్టిపారేశారు. ఆ రోజు నుంచి వీరు సన్నిహితంగా ఉంటూ మీడియా కంట్లో పడ్డారు.

తాజాగా దిషా, టైగర్‌లు బాంద్రాలో సెలబ్రిటీలు తరచూ సందర్శించే ప్రముఖ రెస్టారెంట్‌ బాస్టిన్‌లో బ్రంచ్‌ చేశారు. ఈ సందర్బంగా దిశా వేసుకొచ్చిన డ్రస్ హైలెట్ గా నిలిచింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఈ విషయమై ఆమెను ప్రశ్నిస్తే… వెండితెర మీద మా రొమాన్స్‌ బాగుందని ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. అంతేతప్ప నిజ జీవితంలో మా మధ్య ఎలాంటి రొమాన్స్‌ లేదు. ఇద్దరం కెరీర్‌ని ఓ ఛాలెంజ్‌గా తీసుకున్న వాళ్ళం. ఇలాంటి కామన్‌ పాయింట్లు ఇద్దరిలో ఉండడంతో స్నేహం త్వరగా కలిసింది. మొదటి నుంచీ నేను ఒకటే మాట చెబుతున్నాను. నేనూ టైగర్‌ ష్రాఫ్‌ మంచి స్నేహితులం మాత్రమే! నేను ఇప్పుడిప్పుడే కెరీర్‌లో నిలదొక్కుకుంటున్నాను. ప్రేమా పెళ్ళి ఆలోచనలు పెట్టుకోదలచుకోలేదు అని తేల్చేసింది.

ఇక కేరీర్ పరంగా…

దిశా పటానీ బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ హీరోగా తెరకెక్కనున్న భారత్‌లో కనిపించనుంది. అలీ అబ్బాస్‌ జఫర్‌ దర్శకత్వంలో రూపొందుతూ కత్రినా కైఫ్‌, టబు, సునీల్‌ గ్రోవర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ 2019 ఈద్‌ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు టైగర్‌ ష్రాఫ్‌ కరణ్‌ జోహార్‌ నిర్మించే స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2లో నటిస్తున్నారు. అనన్య పాండే తెరంగేట్రం చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మేలో విడుదల కానుంది.