భర్తతో విడిపోతున్నానని ప్రకటించిన నటి

భర్తతో విడిపోతున్నానని ప్రకటించిన నటి

సినీ పరిశ్రమకు చెందిన మరో జంట తమ వైవాహిక జీవితానికి గుడ్‌బై చెప్పి విడాకులుకు రెడీ అవుతోంది. నటి దియా మీర్జా తన భర్త నుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటిస్తూ అభిమానులను షాక్‌కు గురిచేశారు.

‘పదకొండేళ్లు ఒకరితో ఒకరు జీవితాలను పంచుకుని ఇప్పుడు పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. కానీ ఎప్పటికీ స్నేహితుల్లాగే ఉంటాం. ఒకర్నొకరు గౌరవించుకుంటాం. మా ప్రయాణాలు విభిన్న మార్గాలను ఎంచుకున్నప్పటికీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని గౌరవిస్తూనే ఉంటాం. మమ్మల్ని అర్థం చేసుకుని సహకరించినందుకు మా కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, మీడియా సన్నిహితులకు ధన్యవాదాలు. ఈ సమయంలో మాకు ప్రైవసీని కల్పిస్తారని ఆశిస్తున్నాం. ఇక నుంచి ఈ విషయంపై నేను ఎలాంటి కామెంట్లు చేయాలనుకోవడం లేదు. ధాంక్యూ’ అని పేర్కొన్నారు.

దిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సాహిల్‌ సంఘా, దియా చాలా కాలం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. 2014 అక్టోబర్‌లో దిల్లీలోని చత్తార్‌పూర్‌లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి పిల్లలు లేరు.