“NTR 30” హీరోయిన్ పై బి టౌన్ మీడియా చెప్తుంది ఇదే..!

టాలీవుడ్ బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా తన భారీ పాన్ ఇండియా హిట్ ట్రిపుల్ ఆర్(RRR) తర్వాత మరో దర్శకుడు కొరటాల శివతో చేసే పాన్ ఇండియా సినిమాలో యాక్టు చెయ్యనున్నాడు.

మరి ఈ భారీ సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్లోనే అనౌన్స్ చేయగా దీనిపై ఇప్పటికే అనేక అంచనాలు నెలకొన్నాయి. దీనితో ఈ భారీ సినిమా ఇంకా స్టార్ట్ కావాల్సి ఉంది అలాగే హీరోయిన్ కూడా ఎవరు అనేది ఇంకా డిసైడ్ కాలేదు.

దీనితో ఈ విషయంలో అభిమానులకి క్లారిటీ ఇంకా రాలేదు. అయితే చాలా మంది స్టార్స్ బాలీవుడ్ నుంచి తర్వాత మన టాలీవుడ్ నుంచి కూడా పరిశీలనలోకి వచ్చాయి కానీ ఇప్పుడు అయితే రీసెంట్ గా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా పేరు వచ్చింది.

కానీ తాజాగా బి టౌన్ కి చెందిన బాలీవుడ్ మీడియా ప్రముఖులు నుంచి వస్తున్న సమాచారం ప్రకారం టాలెంటెడ్ హీరోయిన్ కీర్తి సురేష్ ని తీసుకునే ఛాన్స్ ఉందట. మరి ఇది ఎంతవరకు నిజం అనేది ఇంకా బయటకి తెలియాల్సి ఉంది. అలాగే సినిమాపై కూడా సరైన అప్డేట్స్ కోసం అయితే అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.