సుషాంత్ సింగ్ ని దావూద్ ఇబ్ర‌హీం చంపేసాడు!

బాలీవుడ్ న‌టుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణం దేశ వ్యాప్తంగా ఎంత సంచ‌ల‌న‌మైందో తెలిసిందే. గ‌త‌నెల‌లో ఓ హోట‌ల్ లో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ నేప‌థ్యంలో ఘ‌ట‌న‌పై చాలా అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. నెపోటిజం కార‌ణంగా బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ఆరోప‌ణ‌లు తెర‌పైకి వ‌చ్చాయి. దీనిలో భాగంగా క‌ర‌ణ్ జోహార్, స‌ల్మాన్ ఖాన్ స‌హా ప‌లువురి పేర్లు ఈ కేసులోకి లాగారు. ఈ నేప‌థ్యంలో ముంబై పోలీసులు అన్ని కోణాల్లోనూ కేసును ద‌ర్యాప్తు చేసారు. ఇంకా ద‌ర్యాప్తు జ‌రుగుతూనే ఉంది. ప‌లువురి బాలీవుడ్ సెల‌బ్రిట‌ల్నీ విచారించారు. తాజాగా ఈకేసుకు సంబంధింది మాజీ `రా `అధికారి ఎన్ కే సూద్ సంచ‌ల‌న ఆరోప‌ణ చేసారు.

ఆయ‌న ఒక వీడియో ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. సుషాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకోలేదు. అత‌న్ని చంపేసారు. ఆ ప‌ని చేసింది ఎవ‌రో కాదు అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం అంటూ అరోపించారు. దావూద్ ప్ర‌మేయం ఉంద‌ని..అత‌ను కాక‌పోతే…అత‌ని అనుచ‌రులు ఈ ఘాతుకానికి పాల్ప‌డి ఉంటార‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ ఆరోప‌ణ చేసింది సాదా? సీదా అధికారి కాదు. ఏకంగా `రా` మాజీ అధికారే ఇలా అనుమానించడంతో మ‌రోసారి ఈ కేసు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మాఫియా డాన్ ల‌తో సుషాంత్ లింకులేంటి? అన్న అనుమానం వ్య‌క్తం అవుతోంది. ఎలాంటి సినీ నేప‌థ్యం లేకుండా బాలీవుడ్ కి వ‌చ్చాడు.

అత‌ని కుటుంబ స‌భ్యులు కూడా ఎవ‌రూ రాజ‌కీయాల‌లో లేరు. సుషాంత్ ది చాలా సాధార‌ణ కుటుంబం. ఈ నేప‌థ్యంలో దావూద్ ప్ర‌మేయం ఎలా? అన్న దానిపై సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. మ‌రి ఈ ఆరోప‌ణ‌లో నిగ్గు తేలాలాంటే ఆ రా అధికారి ఇంకా వివ‌రాలు వెల్ల‌డిస్తే గానీ…అస‌లు విషయం ఏంట‌న్న‌ది తెలియ‌దు. మ‌రి ముంబై పోలీసులు ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటారా? లేదా? అన్న‌ది చూడాలి. సుషాంత్ కుటుంబ స‌భ్యులు కూడా దీన్ని ఆత్మ‌హ‌త్య‌గా కాకుండా హ‌త్య‌గా అనుమానం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే.