జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఘోర ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన విషయం తెలిసిందే. కానీ, ఈ విషాదాన్ని తలచుకుంటూనే మహారాష్ట్రకు చెందిన దంపతులు సుశాంత్, ప్రీతి తమ వివాహ వార్షికోత్సవాన్ని ఇదే ప్రదేశంలో జరిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. భయాన్ని పక్కన పెట్టి, పహల్గాంలో సాధారణ జీవితం కొనసాగుతున్నదని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు.
ఉగ్రదాడి నేపథ్యంలో పర్యాటకులు కొంత ఆందోళనలో ఉన్నప్పటికీ, సుశాంత్, ప్రీతి ధైర్యంగా ముందుకు వచ్చారు. “పహల్గాంలో ప్రజలు ఎంతో ఆప్యాయంగా మాతో మమేకమవుతున్నారు. ఇక్కడ ఎటువంటి భయానికి అవకాశం లేదు. అందరూ కూడా వచ్చి కశ్మీర్ అందాలను ఆస్వాదించాలి” అని వారు చెప్పారు. తాము భయాన్ని అధిగమించి సందేశాన్ని ఇవ్వడం కోసమే ఇక్కడికి వచ్చామని వారు స్పష్టం చేశారు.
VIDEO | Pahalgam: Just days after the terror attack near Pahalgam that killed 26 people, mostly tourists, Maharashtra couple Sushant and Preeti celebrated their wedding anniversary in the town.
They said they chose to visit Pahalgam to send a message that life is returning to… pic.twitter.com/2QxWGDbYIU
— Press Trust of India (@PTI_News) April 26, 2025
కశ్మీర్లో ప్రకృతి సౌందర్యం ఎంత అపురూపమైనదో స్వయంగా చూడాలని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఉగ్రవాదుల భయానికి మడగు లేకుండా, ధైర్యంగా పర్యటనలు కొనసాగించాలని కోరారు. పహల్గాంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, ఆతిథ్యం ఎప్పటిలాగే అపూర్వంగా ఉందని అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో కాన్పూర్కు చెందిన పర్యాటకుడు సంజయ్ కూడా తన అనుభవాన్ని పంచుకున్నారు. “దాడి జరిగినరోజే మేము పహల్గాంలోకి అడుగుపెట్టాం. మొదట భయం వేసినా, ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నమ్ముతున్నాం” అని అన్నారు. ఈ నమ్మకంతోనే పర్యటన కొనసాగించామని చెప్పారు. మొత్తానికి, సుశాంత్, ప్రీతి ధైర్యం, సంజయ్ విశ్వాసం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా మారాయి.