బాలీవుడ్ సెల‌బ్రిటీస్‌కి చుక్క‌లు చూపిస్తోంది!

బాలీవుడ్ సింగ‌ర్ క‌నికా క‌పూర్ ఇప్పుడు బాలీవుడ్ సెల‌బ్రిటీల‌తో పాటు పొలిటిక‌ల్ లీడ‌ర్‌ల‌కీ చుక్క‌లు చూపిస్తోంది. స‌న్నీలియోన్ న‌టించిన ఓ బేబీ గీతాన్ని ఆల‌పించి వార్త‌ల్లో నిలిచిన క‌నిక పేరు ప్ర‌స్తుతం దేశం మొత్తం మారు మ్రోగిపోతోంది. కార‌ణం ఆమెకు క‌రోనా సోక‌డ‌మే. ఇటీవ‌ల లండ‌న్ నుంచి ఇండియా వ‌చ్చిన క‌నిక ఆ త‌రువాత ముంబైలో జ‌రిగిన ప‌లు పార్టీల్లో పాల్గొంద‌ట‌. ఆమె పాల్గొన్న పార్టీల్లో రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు సినీ స్టార్స్ కూడా వున్నార‌ట‌.

దాదాపు 400 మంది ఈ పార్టీల్లో పాల్గొన్నార‌ట‌. క‌నిక‌కు క‌రోనా వైర‌స్ పాజిటివ్ అని తేల‌డంతో ఆమె పాల్గొన్న పార్టీల్లో అటెండ్ అయిన సెల‌బ్రిటీలంతా అసోలేష‌న్ సెంట‌ర్ల‌కు ప‌రుగుతు పెడుతున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, ఇండియ‌న్ ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు అశోక్ పండిత్ గాయ‌ని క‌నికా క‌పూర్‌పై మండిప‌డ్డారు. ప‌ది రోజుల క్రితం ఇండియా వ‌చ్చిన క‌నిక బాధ్య‌తార‌హితంగా వ్య‌వ‌హ‌రించింద‌ని, త‌న త‌ప్పిం వ‌ల్ల పార్టీల్లో పాల్గొన్న వారి జీవితాల్ని కూడా ప్ర‌మాదంలో నెట్టింద‌ని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు.