“నీ ప్రతి రూపం వారిలో చూస్తున్నా” అనిల్ కపూర్

భారతీయ సినిమా రంగాన్ని విశేషంగా ప్రభావితం చేసిన అందాల తార శ్రీదేవి .  దక్షిణ భారతంలో తన నటనతో మెప్పించిన శ్రీదేవి ఉత్తర భారతంలో కూడా  తన ప్రతిభతో  నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది . తన ఇద్దరు కుమార్తెలు జాహ్నవి , ఖుషి  కూడా  తన లాగే హీరోయిన్లను  చేయాలనుకుంది . పెద్ద కూతురు సినిమా జాహ్నవి సినిమా విజయాన్ని చూడకుండానే ఈ సంవత్సరం  ఫిబ్రవరి 24న దుబాయ్ లో మరణించింది .

హిందీ సినిమా రంగంలో శ్రీదేవి లేని లోటు   ఎప్పటికీ భర్తీ కాదు . శ్రీదేవి మరణించిన తరువాత బోని కపూర్  మానసికకముగా బాగా నలిగిపోయాడు . ఆయన్ని ఇద్దరు కుమాటలు ఓదార్చారు . ఢిల్లీలో జరిగిన జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎన్నికైన శ్రీదేవి అవార్డును బోని తో పాటు జాహ్నవి , ఖుషి  స్వీకరించారు . ఇప్పుడు శ్రీదేవి చీరలను , ఫ్యాట్లు , షర్ట్ లను ఇద్దరు కుమార్తెలు ధరిస్తున్నారు .  వారిని చూసిన  అనిల్  కపూర్ వారిలో శ్రీదేవిని చూశాడట . అందుకే శ్రీదేవిని తలచుకొని  “శ్రీదేవి నీ గాపకాలు వెన్నాడుతూనే వున్నాయ్ . నీ రూపాన్ని ఇప్పుడు నీ పిల్లలు జాహ్నవి , ఖుషి లో చూస్తున్నా ” అని చెప్పాడు .