టాలీవుడ్ పై ఐశ్వర్య ఫోకస్

అచ్చమైన తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ తమిళంలో నిరూపించుకొని ఇక టాలీవుడ్ పై

ఫోకస్ పెట్టింది. తమిళ ‘కణ’కు తెలుగు రీమేక్ ‘కౌసల్య కృష్ణమూర్తి’తో టాలీవుడ్‌లో తళుక్కుమన్న ఐశర్య రాజేష్ -ఇప్పుడు తెలుగు చిత్రాలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు కనిపిస్తోంది. కౌసల్య పాత్రతో మెప్పించిన ఐశ్వర్య -తరువాత ‘మిస్ మ్యాచ్’ చిత్రంతో తెలుగు ఆడియన్స్‌ని పలకరించింది. ఇప్పటికే ఆమె విజయ్ దేవరకొండ -వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో చేస్తోంది. తాజాగా నాని -శివనిర్వాణ కాంబోలో రానున్న ‘టక్ జగదీష్’లోనూ అవకాశం అందుకుంది. ఇవేగాక.. మరో రెండు చిత్రాలు ఒప్పుకుందని సమాచారం