ఎమోషనల్ సిరీస్ లో స్టార్ హీరోయిన్ ?

 
కరోనా దెబ్బకు సినిమా అంటే  థియేటర్స్ లోనే చూడాలనే రోజులు పోయాయి.  పైగా మన  స్మార్ట్‌ ఫోన్ల వాడకం ఎంత వేగంగా పెరిగిందో..  నేటి యువతరం అభిరుచి కూడా అంతకన్నా వేగంగా మారుతుంది. ఇప్పుడు అందరూ డిజిటల్ స్ట్రీమింగ్‌ వైపే వెళ్తున్న సంగతి తెలిసిందే. దాంతో ఫిల్మ్ ఇండస్ట్రీస్ కూడా డిజిటిల్  వైపు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చి పడింది.  ఈ క్రమంలోనే బడా నిర్మాతలు సైతం  వెబ్ సిరీస్ లను నిర్మించే ప్లాన్ లో పడ్డారు. 
 
 
ఈ నేపథ్యంలో స్టార్ హీరోయిన్లు కూడా డిజిటిల్ వైపు చూస్తున్నారు.  ఒకవైపు వరుస సినిమాలతో బిజీబిజీగా ఉంటూనే..  మరోవైపు  వెబ్ సిరీస్ కథలను కూడా నటించేయడానికి సై అంటున్నారు. కాగా ఇప్పటికే స్టార్ హీరోయిన్  సమంత ‘థ ఫ్యామిలీ మాన్’ అనే వెబ్ సిరీస్ రెండవ సీజన్ లో  నటించింది. అలాగే కాజల్ అగర్వాల్ కూడా ఓ వెబ్ సిరీస్  చేయనుంది.  ఇప్పుడు వీరి బాటలోనే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అడుగులు వేస్తుందట.  తమిళంలోని ఓ వెబ్ సిరీస్ కథ పట్ల బాగా  ఇంట్రస్టింగ్ గా ఉందట. 
 
ఇది తండ్రి, కూతుళ్ల మధ్య జరిగే ఎమోషనల్ సిరీస్ అని,  ఎక్కువ నిడివి ఉన్న ఇలాంటి వెబ్ సిరీస్ స్టోరీస్ లో నటిస్తే  తమ ప్రతిభను కనబర్చడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందనే ఉద్దేశ్యంతో  తమన్నా ఈ  వెబ్ సిరీస్ లో నటించబోతుందట. అన్నట్టు ఈ వెబ్‌ సిరీస్‌ ను  దర్శకుడు రామ సుబ్రమణ్యన్ డైరెక్ట్ చేయనుండగా, అనంద్ వికటన్ సంస్థ నిర్మిస్తోంది. మొత్తానికి తమన్నా కూడా వెబ్ చూపులు చూస్తోంది.