అభిషేక్ బ‌చ్చ‌న్ కీ క‌రోనా..బ‌చ్చ‌న్ ఫ్యామిలీ లో టెన్ష‌న్ రెట్టింపు

బాలీవుడ్ లోనూ కరోనా వైర‌స్ క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ఇప్ప‌టికే బిగ్ బీ అమితాబ‌చ్చ‌న్ కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆయ‌న ట్విట‌ర్ వేదిక‌గా త‌న‌ని గ‌త‌ ప‌దిరోజులుగా క‌లిసిన వారంతా ప‌రీక్ష‌లు చేయించుకోవాల్సిందిగా సూచించారు. ఇంకా ఆయ‌న‌తో స‌న్నిహితంగా ఉన్న వారంతా విధిగా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు. ప్ర‌స్తుతం అమితాబ్ ముంబై నానావ‌తి ఆసుప‌త్రిలో క‌రోనా చికిత్స పొందుతున్నారు. ఇంకా ఆయ‌న కుటుంబ స‌భ్యులంద‌రికీ కూడా క‌రోనా ప‌రీక్ష‌లు పూర్తిచేసారు. ఇందులో అభిషేక్ బ‌చ్చ‌న్ కి కూడా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆయ‌న కూడా ఐసోలేష‌న్ కి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం తండ్రీకొడుకులిద్ద‌రు వైర‌స్ తో పోరాటం చేస్తున్నారు.

మిగ‌తా కుటుంబ స‌భ్యుల ఫ‌లితాలు రావాల్సి ఉంది. ఒకే కుటుంబంలో ఇరువురికి పాజిటివ్ రావ‌డంతో మిగ‌తా స‌భ్యుల‌కు సోకే ఉంటుంద‌ని అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. జ‌యాబ‌చ్చ‌న్, ఐశ్వ‌ర్యారాయ్, అమితాబ్ కుమార్తె స‌హా అల్లుడు ఇటీవ‌ల ఒకే ఇంట్లో ఉన్న‌ట్లు స‌మాచారం. అభిషేక్ తో స‌న్నిహితంగా ఉన్న‌వారంతా కూడా ఇప్పుడు ప‌రీక్ష‌లు చేయించుకోవా ల్సిందే . ఇప్ప‌టికే ఫ్యామిలీ మెంబ‌ర్ల అంద‌రికీ ప‌రీక్ష‌లు జ‌రిగాయి. ఫ‌లితాలు రావాల్సి ఉంది. ఇక అమితాబ్ వ‌య‌సు 77 సంవ‌త్స‌రాలు కావ‌డంతో ఆయ‌న ఆరోగ్యంపై అభిమానుల్లో ఆందోళ‌న నెల‌కొంది. అమితాబ్ వైర‌స్ నుంచి తొంద‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు దేవుళ్ల‌ను ప్రార్ధిస్తున్నారు. ప్ర‌ధాని మోదీ కూడా ఇర‌వురు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ట్వీట్ చేసారు.

వైర‌స్ తో ఇప్ప‌టికే మ‌హ‌రాష్ర్ట పోరాటం చేస్తుంది. రోజు దేశంలో అధికంగా కేసులు ఆ రాష్ర్టంలోనే న‌మోద‌వుతున్నాయి. ఇప్ప‌టికే ముంబై ధారావిని చుట్టేసింది. దీంతో అక్క‌డ కంటైన్మెంట్ జోన్ల‌ల‌లో లాక్ డౌన్ కొన‌సాగుతుంది. అయినా వైర‌స్ ఇంకా అదుపులోకి రాలేదు. గ‌త నెల రోజులుగా కేసులు విప‌రీతంగా పెరిగిపోయాయి. ఆ త‌ర్వాత త‌మిళనాడు, తెలంగాణ‌, ఢిల్లీ, ఏపీ చుట్టూనే క‌రోనా పంజా విసురుతోంది. ఇప్ప‌టికే ఆయా రాష్ర్టాల ప్ర‌భుత్వాలు అప్ర‌త‌మ‌త్త‌మై నివార‌ణ చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి.