YS Jagan – Vamsi: వల్లభనేని వంశీ అరెస్ట్‌పై జగన్ మౌనమేల?

YS Jagan – Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ అరెస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయ్యారు. ఫిర్యాదుదారుడిని కిడ్నాప్ చేసి కేసు వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశారనే అభియోగాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం రాత్రి వంశీని జడ్జి ఆదేశాలతో జైలుకు తరలించారు.

వంశీ అరెస్ట్‌పై వైసీపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్వయంగా వంశీ తరఫున కోర్టులో వాదనలు వినిపించారు. ఇతర నేతలు కూడా వంశీకి మద్దతుగా నిలిచారు. అయితే, ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయినప్పటికీ పార్టీకి మార్గదర్శకుడిగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఆశ్చర్యకరంగా మౌనం పాటిస్తున్నారు. వంశీ అరెస్ట్ వార్తపై ఆయన నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.

జగన్‌కు వంశీ చాలా సన్నిహితుడు. అధికారంలో ఉన్నప్పుడు వంశీకి జగన్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, వంశీ పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టాడని విజిలెన్స్ శాఖ కూడా నివేదికలో పేర్కొంది. బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్ అరెస్ట్ సమయంలో జగన్ స్వయంగా జైలుకు వెళ్లి మద్దతు తెలిపారు. కానీ వంశీ విషయంలో ఆయన పూర్తిగా నిష్క్రియంగా కనిపిస్తున్నారు.

ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒకే ప్రశ్న—వంశీపై జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారు? వంశీతో జగన్‌కు పని ముగిసిందా? లేక భవిష్యత్తు రాజకీయ సమీకరణల కోసం ఏదైనా వ్యూహం ఉందా? ఇవన్నీ పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. మరి జగన్ ఈ అంశంపై రేపట్లోనైనా ప్రెస్ మీట్ లేదా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తారా అనేది ఉత్కంఠగా మారింది.

పవన్ పవర్ తగ్గించడం టీడీపీకి సాధ్యమేనా | Exclusive Report On Pawan Kalyan | Nara Lokesh | TR