చిలక జోతిష్కుడు లగడపాటి రాజగోపాల్ సర్వేలను నమ్ముకుంటే తెలుగుదేశంపార్టీ నేతలు మళ్ళీ నిండా ముణగటం ఖాయమేనా ? వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో మెజారిటీ జాతీయ మీడియా సంస్ధలు కెసియార్ దే అధికారం అని చెప్పాయి. అయితే లగడపాటి మాత్రం మహాకూటమికే అధికారం అంటూ ఒకటే ఊదరగొట్టారు. దాంతో లగడపాటి సర్వేని నమ్ముకున్న వందల కోట్ల రూపాయల బెట్టింగ్ లు కట్టారు.
సీన్ కట్ చేస్తే లగడపాటి సర్వేను నమ్ముకుని పందేలు కట్టిన వాళ్ళంతా నెత్తిన గుడ్డేసుకున్నారు. వారిలో టిడిపి నేతలు, సానుభూతిపరులు కూడా చాలామందే ఉన్నారు. తీరా చూస్తే కేవలం చంద్రబాబుకు అనుకూలంగా కావాలనే లగడపాటి తప్పుడు సర్వే ఇచ్చారని తర్వాత బయటపడింది. నిండా ముణిగిన వాళ్ళు చేసేదేంలేక లగడపాటిని అమ్మనాబూతులు తిట్టుకున్నారు.
అదే విధంగా తాజాగా ఏపి ఎన్నికల్లో మళ్ళీ సర్వేలంటూ లగడపాటి హల్ చల్ చేస్తున్నారు. ఇక్కడ కూడా వైసిపికే అధికారమని జాతీయ మీడియా అంతే చెబుతుంటే చిలక జ్యోతిష్కుడు మాత్రమే సైకిల్ కే అధికారమంటున్నారు. సైకిల్ తిరిగి అధికారంలోకి వస్తుందనేందుకు లగడపాటి చెబుతున్న కారణాలు కూడా విచిత్రంగా ఉన్నాయలేండి.
సరే ఏదెలాగున్నా లగడపాటి జోస్యాన్ని నమ్ముకుని మళ్ళీ టిడిపి నేతలు, సానుభూతిపరులు బెట్టింగులకు దిగుతారా అన్నదే అందరి అనుమానం. లగడపాటి సర్వేని పక్కనపెట్టినా తమ గెలుపుపై తమ్ముళ్ళకే నమ్మకం లేనపుడు ఎవరో చిలక జ్యోతిష్కుడు చెప్పింది విని బెట్టింగులు కడతారా ?
